అమరావతిలో నిర్మాణంలో ఉన్న సచివాలయ టవర్లకు సంబంధించిన పూర్తి స్థాయి డిజైన్లు త్వరలో ఖరారు కానున్నాయి. లండన్కు చెందిన ఫోస్టర్స్ సంస్థ రూపొందిస్తున్న నమూనాలు తుది దశలో ఉన్నాయి. ప్రభుత్వ సముదాయంలో భాగంగా నిర్మిస్తున్న ఐదు టవర్లను ఒకదానితో మరొకదాన్ని వంతెనల ద్వారా అనుసంధానించే ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈ టవర్లలో ఉక్కుతో నిర్మించే డయాగ్రిడ్ ఆకృతులు అమరావతిలోనే అమర్చనున్నారు.
68 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టవర్లు
ఐకానిక్ టవర్ల నిర్మాణం మొత్తం 68,88,064 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొనసాగుతోంది. వీటిలో జీఏడీ టవర్ అత్యంత ఎత్తుగా ఉండనుంది. బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి 47 అంతస్తులు ఉండే ఈ టవర్లోనే ముఖ్యమంత్రి కార్యాలయం ప్రతిష్టించనున్నారు. దీని టెర్రస్పై హెలిప్యాడ్ నిర్మించనున్నారు.
మిగతా నాలుగు హెచ్వోడీ టవర్లు ఒక్కోటి 39 అంతస్తులు కలిగి ఉంటాయి. ఒక టవర్ నుంచి మరో టవర్లోకి వెళ్లేందుకు 900 మీటర్ల పొడవైన గ్లాస్ వంతెన నిర్మిస్తారు. ఈ వంతెన ద్వారా మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు,సందర్శకులు ఒక టవర్ నుంచి మరొకటికి సులభంగా వెళ్లగలరు.
అదనంగా, టవర్లకు అనుబంధంగా 8 ఎమినిటీస్ బ్లాక్లు నిర్మించనున్నారు. ఒక్కో బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మూడు అంతస్తులు కలిగి ఉంటుంది.
నేల సామర్థ్య పరీక్షలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలపాటు ఈ ప్రదేశం నీటిలో మునిగిపోయింది.
కాబట్టి నేల భారం భరించే సామర్థ్యం గుత్తేదారు సంస్థలు పరీక్షించాయి. వెయ్యి టన్నుల బరువుతో చేసిన పరీక్షల్లో సానుకూల ఫలితాలు వచ్చాయి.
డయాగ్రిడ్ నిర్మాణంలో భారీ ఉక్కు వినియోగం
ఐకానిక్ టవర్ల ఆకృతులు డయాగ్రిడ్ విధానంలో నిర్మించబడుతున్నాయి.
ప్రతి టవర్కి 15-20 వేల టన్నుల ఉక్కు అవసరమవుతుంది. పనులు చేపట్టిన మూడు గుత్తేదారు సంస్థలు, అవసరమైన డయాగ్రిడ్ ఆకృతుల ఫ్యాబ్రికేషన్ను అమరావతిలోనే చేయాలని నిర్ణయించాయి.
ఇందుకోసం 10 ఎకరాల స్థలాన్ని వర్క్షాపుల కోసం కేటాయించమని సీఆర్డీఏకి వినతి పెట్టాయి.
ఎందుకంటే, ఈ భారీ పరిమాణపు డయాగ్రిడ్ ఆకృతులను ఇతర ప్రాంతాల్లో ఫ్యాబ్రికేట్ చేసి ఇక్కడికి తరలించడం రవాణా సమస్యలతో పాటు సమయ వృథా అవుతుంది. అందువల్ల పని ప్రదేశంలోనే యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా సమయం ఆదా చేయాలన్న ఆలోచనలో ఉన్నాయి.


