Homeఅంతర్జాతీయంనేపాల్ నుంచి మరికాసేపట్లో విమానంలో రానున్న ఏపీవాసులు..

నేపాల్ నుంచి మరికాసేపట్లో విమానంలో రానున్న ఏపీవాసులు..

- Advertisement -

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు మంత్రి నారా లోకేశ్‌ చేస్తున్న కృషి ఫలిస్తోంది. మంత్రి చొరవ వల్ల అధికారులు చర్యలు చేపట్టి, పలు కార్యాచరణలను వేగవంతంగా అమలు చేస్తున్నారు. నేపాల్ నుంచి అనేక మంది యాత్రికులు కాసేపట్లో ఆంధ్రప్రదేశ్‌కు బయల్దేరనున్నారు. ప్రస్తుతం, సిమికోట్ ప్రాంతంలో చిక్కుకున్న 12 మందిని ప్రత్యేక విమానంలో తరలించి, ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దులోని నేపాల్‌గంజ్ ఎయిర్‌పోర్ట్‌ వద్దకు తీసుకువచ్చారు.
అక్కడి నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో వారు లఖ్‌నవూ వరకు వెళ్లనున్నారు.
లఖ్‌నవూ నుంచి హైదరాబాద్ వైపు విమానంలో తరలింపుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలి: లోకేశ్
కాఠ్మాండూ సమీప ప్రాంతంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి అధికారులతో సమన్వయం చేసి లోకేశ్‌ ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. నేపాల్‌లో చిక్కుకున్న వారు రాష్ట్రానికి సురక్షితంగా తిరిగివచ్చి వారి ఇళ్లకు చేరే వరకూ సంబంధిత అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు