నేపాల్ దేశంలో జెన్-జెడ్ ఉద్యమకారులు చేపట్టిన ఆందోళనలను ఆసరాగా తీసుకుని అనేక ఖైదీలు జైళ్ల నుంచి పరారవుతున్నట్లు తాజా వార్తలు వెల్లడి అవుతున్నాయి.రామేచాప్ జైలు నుంచి పరారైన కొందరు ఖైదీలపై ఆర్మీ బలగాలు కాల్పులు జరిపిన సంఘటన దేశవ్యాప్తంగా ఉత్కంఠను పెంచింది.దీంతో నేపాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.జైలు పరిరక్షణ బాధ్యత వహిస్తున్న చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ శ్యామ్కృష్ణ థామా ప్రకారం,గురువారం జైలు గేట్లు తాళాలు విరగ్గొట్టి, ఖైదీలు పరారవడానికి యత్నించారని తెలిపారు.ఈ ప్రయత్నాన్ని ఆపేందుకు ఆర్మీ బలగాలు కాల్పులు జరిపాయని ఆయన వివరించారు.ఈ కాల్పుల్లో డజను మందికి పైగా ఖైదీలు గాయపడ్డారు. ప్రస్తుతం వారికి వైద్యచికిత్స అందిస్తున్నట్లు వివరించారు.పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నట్లు పేర్కొన్నారు.
అయితే, కాఠ్మాండూ, పోఖరా, లలిత్పుర్ వంటి ప్రధాన నగరాల్లోని జైళ్ల నుంచి ఇప్పటికే వందలాది మంది ఖైదీలు పారిపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.మొత్తం మొత్తం 7,000 మంది ఖైదీలు పరారైనట్లు సమాచారం అందింది.పరారైన నేపాలీ ఖైదీలను నియంత్రించేందుకు భారత సాయుధ పోలీసు సేన, SSB వ్యవస్థాపితంగా చర్యలు చేపట్టింది.ఉత్తర్ప్రదేశ్లోని సిద్ధార్థనగర్ సమీపంలో 22 మంది నేపాలీ ఖైదీలను ఎస్ఎస్బీ అధికారులు ఆపినట్టు తెలియజేశారు.నేపాల్లో ఆందోళనలు తీవ్రమైన నేపథ్యంలో, సరిహద్దుల భద్రత పూర్తిగా ఎస్ఎస్బీ హస్తంలో ఉంది.
గురువారం ఆయన తన ఎక్స్లో పోస్టు పెట్టి ఁదయచేసి ఓపికతో ఉండండి. తాత్కాలిక ప్రభుత్వం త్వరలో ఏర్పాటవుతుంది. అనంతరం కొత్త ఎన్నికలు జరుగుతాయి అని చెప్పారు.సామాజిక మాధ్యమాలపై నిషేధంతో మొదలైన జెన్-జెడ్ ఉద్యమం, చివరికి అవినీతి వ్యతిరేక ఆందోళనగా మారి తీవ్ర హింసకు దారితీసింది.కాఠ్మాండూతో సహా పలు నగరాల్లో పెద్దఎత్తున ఘర్షణలు జరగడంతో ఆర్మీ కర్ఫ్యూ విధించింది.ఇప్పటివరకు ఈ ఉద్రిక్త ఆందోళనల్లో 25 మంది ప్రాణాలు కోల్పోయగా, 600 మందికి పైగా గాయపడ్డారు.


