Tuesday, June 17, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఇంటర్మీడియట్ ప్రధమ, 8వ, 9వ తరగతులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి..

ఇంటర్మీడియట్ ప్రధమ, 8వ, 9వ తరగతులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి..

మోడల్ స్కూల్, కళాశాల ప్రిన్సిపాల్ పద్మశ్రీ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని గుట్ట కింద పల్లి వద్దగల ఆదర్శ (మోడల్ స్కూల్) పాఠశాల, జూనియర్ కళాశాల లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరమునకు, 8వ తరగతి, 9వ తరగతి ప్రవేశాలకు తల్లిదండ్రులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ పద్మశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పాఠశాల కళాశాలలో నేరుగా అడ్మిషన్లు ఉండవని స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరానికి మాత్రమే ప్రవేశాలు ఉంటాయని, రెండవ సంవత్సరానికి (సెకండ్ ఇయర్) కు ఉండవని తెలిపారు. అదేవిధంగా ఎనిమిదవ, 9వ తరగతి లకు కూడా నేరుగా అడ్మిషన్లు ఉండవని, ప్రతి తరగతికి ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మెరిట్ వచ్చిన విద్యార్థులకు మాత్రమే మంచి ప్రాధాన్యత ఇవ్వబడును అని తెలిపారు. ఈ అవకాశం ఈనెల 20వ తేదీ వరకు మాత్రమే గడువు ఉందని తెలిపారు. ఈ చక్కటి అవకాశాన్ని తల్లిదండ్రులు తమ పిల్లల కోసం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు