- Advertisement -
డాగ్ స్క్వాడ్ తో కలిసి నిర్వహిస్తున్న బాంబు డిస్పోజబుల్ విభాగం
న్యూదిల్లీ : దేశ రాజధాని బాంబుల బెదిరింపుతో మరొక్కసారి ఉలిక్కిపడింది. 10 పాఠశాలలకు సోమవారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్స్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయని ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు. వెంటనే అప్రమత్తం అయిన అధికారులు డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపారు. డాగ్ స్క్వాడ్ తో కలిసి బాంబు డిస్పోజబుల్ విభాగం ఆయా ప్రాంతాలకు చేరుకొని తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డి ఎఫ్ ఎస్ అధికారులు వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఆయా పాఠశాలలను ఖాళీ చేయించినట్లు వారు పేర్కొన్నారు.


