Friday, March 6, 2026
Homeజిల్లాలుఅనంతపురంఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతుల్లోనే కొనసాగించాలి

ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతుల్లోనే కొనసాగించాలి

- Advertisement -


ఎంపీడీవో కార్యాలయం ఎదుట సిపిఐ ధర్నా

విశాలాంధ్ర- ఉరవకొండ: గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పాత పద్ధతుల్లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చెన్నారాయుడు మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదల జీవనాధారమని, ఇందులో మార్పుల పేరుతో కార్మికుల హక్కులను హరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. డిజిటలైజేషన్, ఆధార్ అనుసంధానం వంటి చర్యల వల్ల అనేక మంది కూలీలు పని దొరకక ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా వృద్ధులు, మహిళా కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కూలీలకు వేతనాలు ఆలస్యంగా చెల్లించడమే కాకుండా పనిదినాలను కూడా తగ్గిస్తున్నారని విమర్శించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతి కుటుంబానికి కనీసం 100 రోజుల పని కల్పించడమే కాకుండా, కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించాలని సిపిఐ డిమాండ్ చేసింది. పథకాన్ని బలహీనపరచే అన్ని మార్పులను వెంటనే ఉపసంహరించుకోవాలని, పాత విధానాలనే కొనసాగిస్తూ పేదల జీవనోపాధిని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీవోకి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి గన్నేమోహన్, వజ్రకరూరు కార్యదర్శి హసేన్ భాష, పార్టీ సీనియర్ నాయకులు పురిడి తిప్పయ్య, మహిళా సమైక్య నాయకురాలు నూర్జహాన్ బేగం, ఎఐటియుసి నాయకులు, చక్రధర్, గణప వీరభద్రప్ప, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు