-అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి: ప్రభుత్వ పథకాలను అట్టడుగు వర్గాలకు చేరవేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సచివాలయంలో ఆయన మంత్రులు వివిధ శాఖల కార్యదర్శితో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఈ సమావేశంలో వర్చువల్ గా పాల్గొన్నారు. 10 సూత్రాల అమలు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ఆదాయ శాఖ, పెట్టుబడులు, పి పి ప్రాజెక్టుల పురోగతిపై ఆయన సోమవారం ఉదయం సమీక్షించారు. రియల్ టైం గవర్నెన్స్ లో భాగంగా సాంకేతికతతో పాటు అవేర్ డేటాలి పాలనలో ఏఐ టూల్స్ వినియోగం కేంద్ర ప్రాయోజిత పథకాల యాక్షన్ ప్లాన్ యువతకు నైపుణ్యాభివృద్ధి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్యుర్ విధానం అమలపై ఆయన అధికారులతో చర్చించారు.
అధికారులకు దిశా నిర్దేశం :
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గతంలో జిల్లా కలెక్టర్ల సదస్సులు నిర్వహించేవారు కాదు. ఇప్పుడు మూడు నెలలకోసారి నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి నెల రెండుసార్లు మంత్రివర్గ భేటీ జరుగుతోంది. నెలవారీగా అధికారులు సమీక్ష జరుపుకోవాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇంచార్జ్ మంత్రులు సమర్థంగా పనిచేయాలని ఆయన సూచించారు. ప్రపంచం గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ వైపు వెళుతోందని, ఆదిశగా అడుగులు వేస్తున్నాం. అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటర్ శంకుస్థాపన చేశామన్నారు. డేటా సెంటర్లతో పెను మార్పులు వస్తాయని చెప్పారు. శాఖల వారీగా పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు .


