సాంకేతికత ప్రవేశంతో బ్యాంకింగ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి.
ఫోన్ ద్వారా క్షణాల్లోనే నగదు పంపడం సులభమైంది. మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ల వల్ల బ్యాంక్ కౌంటర్ల వద్ద వెళ్ళాల్సిన అవసరం తగ్గిపోయింది.అయితే చెక్కుల క్లియరింగ్ వ్యవహారంలో ఇప్పటికీ ఆలస్యం కొనసాగుతోంది.ప్రస్తుతానికి చెక్కు క్లియర్ కావడానికి సుమారు రెండు రోజుల సమయం పడుతుంది.
అయితే అక్టోబర్ 4 నుండి ఇది గణనీయంగా తగ్గనుంది. ఆర్ బి ఐ ఆదేశాల ప్రకారం బ్యాంకులు ఈ కొత్త విధానాన్ని శనివారం నుంచి అమలు చేయనున్నారు.
ఉదయం చెక్కు డిపాజిట్ చేస్తే, అదే రోజు సాయంత్రం మీ ఖాతాలో నగదు జమ
ఇప్పటి వరకు రెండురోజులు పట్టే చెక్కుల క్లియరింగ్ ప్రక్రియను గంటల లోపల పూర్తిచేయడానికి ఆర్బీఐ కంటిన్యూస్ క్లియరింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీన్నిచే చెక్కులు సమర్పించిన కొన్ని గంటలలోనే క్లియర్ అవుతాయి.ఈ విధానంలో వ్యాపార గంటల్లో చెక్కుల స్కానింగ్, సమర్పణ, క్లియరింగ్ అన్న ప్రక్రియలు నిరంతరం జరుగుతాయి.ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య చెక్కులను సమర్పించవచ్చు.అప్పుడు అవి సాయంత్రం 7 గంటలలోపు క్లియర్ అవుతాయి.
అంటే, ఉదయం చెక్కు డిపాజిట్ చేస్తే, అదే రోజు సాయంత్రం మీ ఖాతాలో నగదు జమ అవుతుంది.
ఆర్బీఐ ఈ ప్రక్రియలో చెక్కును ఆమోదించడమో, తిరస్కరించడమో, ఎప్పటివరకు (సాయంత్రం 7 గంటలలోపు) పూర్తి కావాలని బ్యాంకులకు ఆదేశించింది.
చెక్కు సమర్పించిన మూడు గంటల్లోనే..
ఈ కంటిన్యూస్ క్లియరింగ్ విధానం రెండు దశలలో ప్రవేశపెడతారు.
మొదటి దశలో, చెక్కులు సాయంత్రం 7 గంటలలోపు క్లియర్ కావాలి అని నిర్దేశించగా.. రెండవ దశ 2026 జనవరి 3 నుంచి ప్రారంభమవుతుంది,అందులో చెక్కు క్లియరింగ్ గరిష్టంగా కేవలం మూడు గంటల్లో పూర్తి అవ్వనుంది.దీన్ని అమలు చేసిన తర్వాత, బ్యాంకు పనివేళల్లో ఎప్పుడు చెక్కు సమర్పించిన మూడు గంటల్లోనే అది ఖాతాలో జమ అవుతుంది.ఉదయం 10 గంటలకు సమర్పించిన చెక్కును మధ్యాహ్నం 1 గంటకు లేదా అంతక్రితం సమయానికి ఖాతాదారుని ఖాతాలోకి జమ చేయాల్సి ఉంటుంది.
దీనికోసం మునుపటిలా రోజులతరబడి వేచి చూడాల్సిన అవసరం తప్పుతుంది.


