Homeఆంధ్రప్రదేశ్బంగాళాఖాతంలో ఆవర్తనం, అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఆవర్తనం, అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

- Advertisement -

రాబోయే రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. నంద్యాల జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. రుతుపవనాలు త్వరలో నిష్క్రమించనున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పంటలకు నష్టం వాటిల్లింది.

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో పశ్చిమమధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వీటి వలన రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యేందుకు అవకాశం ఉంది. పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలిః అని సూచించారు. గురువారం సాయంత్రం వరకు చూస్తే.. నంద్యాల జిల్లా కొత్తపల్లెలో అత్యధికంగా 60.2, ఎనకండ్లలో 52.2 వర్షపాతం నమోదైంది.
నైరుతి రుతుపవనాలు వాయవ్య భారతదేశం నుండి ఈ నెల 16, 17 తేదీల్లో నిష్క్రమించే అవకాశం ఉంది. రుతుపవనాలు వెనక్కి వెళ్ళడానికి వాతావరణం అనుకూలంగా ఉందని భారత వాతావరణ విభాగం (Iవీణ) తెలిపింది. త్వరలోనే రుతుపవనాలు పూర్తిగా తొలగిపోనున్నాయి. దీనివల్ల వాతావరణం పొడిగా మారుతుంది.. ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉంది.

అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున ఈ వర్షాలు కురిసాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చాలా గ్రామాలకి రాకపోకలు ఆగిపోయాయి. వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలో 12.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లాలోని యల్లనూరు మండలంలో 10.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కణేకల్లు-మాల్యం మధ్యలో వేదవతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనితో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో శ్రీసత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు మండలంలో కుషావతి, చిత్రావతి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు