- Advertisement -
శ్రీ సత్య సాయి సేవ సమితి..
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని రైల్వే స్టేషన్లో సాయంత్రం ప్రశాంతి నిలయం నుండి విశాఖపట్నం జిల్లా పాడేరు పోవుటకు సేవాదళ్ సభ్యులకు 50 మందికి రాత్రి భోజనం కొరకు భోజనపు ప్యాకెట్లను పంపిణీ చేసినట్లు శ్రీ సత్య సాయి సేవ సమితి.2 సుబ్బదాసు భజన మందిరం టిఆర్టి సర్కిల్ నిర్వాహకులు తెలిపారు. వారు మాట్లాడుతూ పుట్టపర్తి సాయిబాబా ఆశీస్సులు మేరకు ఈ సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా రైల్వే ప్రయాణికులకు వివిధ సేవల రూపంలో సేవలు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.


