అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా విధానం గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి.
ఒక వైపు ఆయన ప్రభుత్వం ఈ వీసాలపై కఠిన చర్యలు తీసుకుంటుండగా, మరో వైపు అమెరికాలోని కొన్ని రంగాలకు విదేశీ నిపుణుల ప్రతిభ తప్పనిసరిగా అవసరమని ఆయన స్పష్టం చేయడం గమనార్హం.
ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన నిపుణులను అమెరికా తప్పనిసరిగా ఇతర దేశాల నుండి తీసుకురావాల్సిన పరిస్థితి ఉందని ట్రంప్ తెలిపారు.ఫాక్స్ న్యూస్కు మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ను హెచ్-1బీ వీసాల ప్రాధాన్యంపై ప్రశ్నించగా, ఁదేశ అభివృద్ధికి ప్రతిభను ఆహ్వానించడం అవసరంఁ అని ఆయన సమాధానమిచ్చారు.
ప్రాజెక్ట్ ఫైర్వాల్ పేరుతో విచారణ చేపట్టిన కార్మిక శాఖ
ఇంటర్వ్యూ నిర్వాహకురాలు లారా ఇంగ్రహమ్ మన దేశంలోనే చాలామంది ప్రతిభావంతులు ఉన్నారుఁ అని చెప్పగా, ట్రంప్ వెంటనే అది సరైంది కాదు, మన దగ్గర అంత ప్రతిభ లేదుఁ అని ప్రతిస్పందించారు.ఁఉద్యోగం లేకున్న వ్యక్తిని తీసుకువచ్చి క్షిపణులు తయారు చేయమని చెప్పలేము కదా? కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు మన దేశంలో లేవు. అవి నేర్చుకోవాలిఁ అని ఆయన వివరించారు.
ఇక సెప్టెంబర్లో ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాలపై కఠిన నియమాలను అమలు చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
దరఖాస్తు ఫీజును సుమారు లక్ష డాలర్ల వరకు పెంచింది. అదే సమయంలో అమెరికా కార్మిక శాఖ (ణూ) ఃప్రాజెక్ట్ ఫైర్వాల్ః పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది.
మీరు
33%
శాతం పూర్తి చేశారు
వివరాలు
ఫ్లోరిడా వర్సిటీలలో హెచ్-1బీ వీసాలను నిషేధించిన గవర్నర్ డిశాంటిస్
దీని కింద హెచ్-1బీ వీసాలను దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమారు 175 సంస్థలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఁఅమెరికా పౌరుల ఉద్యోగాలను రక్షించేందుకు, వీసా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అన్ని వనరులను వినియోగిస్తాంఁ అని కార్మిక శాఖ కార్యదర్శి లోరీ చావెజ్-డెరెమెర్ అన్నారు.
ఇదే సమయంలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో హెచ్-1బీ వీసాల వినియోగాన్ని నిలిపివేయాలని ఆదేశించారు.
విదేశీ వీసాదారుల స్థానంలో ఫ్లోరిడా నివాసితులను నియమించాలని, చౌక కూలీల విధానంగా దీనిని పేర్కొన్నారు.
2024లో జారీ చేసిన మొత్తం హెచ్-1బీ వీసాలలో 70 శాతం భారతీయులే..
ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలపై అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహా పలు సంస్థలు న్యాయపరమైన సవాళ్లు విసిరాయి.అంతేకాక, ఐదుగురు అమెరికా చట్టసభ్యులు ట్రంప్కు లేఖ రాసి, ఈ చర్యలు భారత్-అమెరికా సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని హెచ్చరించారు.ఇదిలా ఉండగా, 2024లో జారీ చేసిన మొత్తం హెచ్-1బీ వీసాలలో 70 శాతం కంటే ఎక్కువ భారతీయులు పొందారు.అమెరికాలో ఉన్న నైపుణ్య వలసదారుల్లో భారతీయులే అధిక సంఖ్యలో ఉండటమే దీనికి ప్రధాన కారణమని అధికారులు వెల్లడించారు.


