విశాలాంధ్ర ధర్మవరం; పుట్టపర్తి లో గణతంత్ర దినోత్సవ సందర్భంగా కలెక్టర్ బంగ్లాలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన శ్రీ లలిత నాట్య కళానికేతన్ గురువులు బాబు బాలాజీ , రామలాలిత్యా వారి శిష్య బృందం కలిసి అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. వీరితోపాటు శిష్యులు లీలా, ముత్యభావన, లాస్య, ధ్రువ శ్రీ వారు కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించారు. వీటిని తినిపించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ పిల్లలకు బహుమతులతో పాటు గురువులను ఘనంగా సన్మానించారు. ఇందులో భాగంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి బాబు బాలాజీ వారి బృందాన్ని అభినందించారు.
అలరించిన అన్నమాచార్య కీర్తనలు
- Advertisement -
RELATED ARTICLES


