Monday, June 9, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఈనెల 12వ తేదీ లోపు ప్రభుత్వ పాఠశాలలకు మెటీరియల్స్ తప్పనిసరిగా అందజేయాలి

ఈనెల 12వ తేదీ లోపు ప్రభుత్వ పాఠశాలలకు మెటీరియల్స్ తప్పనిసరిగా అందజేయాలి

స్టేట్ మోడల్ ఆఫీసర్ సుబ్బారావు
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 12వ తేదీలోపు విద్యార్థులకు సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్నియు ఆయా పాఠశాల హెడ్మాస్టర్లకు వెంటనే పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని స్టేట్ మోడల్ ఆఫీసర్ సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆకస్మికంగా పట్టణములోని మండల విద్యాశాఖ అధికారి ఆలయాన్ని తనిఖీ చేశారు. అనంతరం గోడౌన్లో ఉన్న స్టాకు వివరాలను, రిజిస్టర్లను, తదితర రికార్డులను వారు పరిశీలించారు. టెస్ట్ బుక్కులు నాణ్యతగా ఉన్నాయా? లేవా?, యూనిఫారంకు సంబంధించినటువంటి వివిధ పరికరాలు లను కొలతవేసి పరిశీలించారు. విద్య సామాగ్రికి భద్రత ఎలా ఉంది? అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంఖ్యను అన్ని ప్రభుత్వ పాఠశాలలో పెంచే విధంగా హెడ్మాస్టర్లకు, ఉపాధ్యాయులకు, తగిన సూచనలు, సలహాలు అవగాహన తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. విద్యార్థులకు సంబంధించిన టెక్స్ట్ బుక్కులు, నోర్సులు, యూనిఫార్, బెల్టు లు,షూస్ అన్నీ కూడా అనుకున్న టార్గెట్ ప్రకారం పంపిణీ చేయాలని తెలిపారు. రాజేశ్వరి దేవి మాట్లాడుతూ ప్రస్తుతం గత వారం రోజులుగా ఆయా పాఠశాలలకు విద్యార్థులకు సంబంధించిన విద్యాసామాగ్రిని పంపిణీ చేస్తున్నట్లు కూడా వారు అధికారికి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ – 1 రాజేశ్వరి దేవి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు