ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం: ధర్మవరం నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం ఈనెల మూడవ తేదీ నుండి నిర్వహిస్తున్నట్లు ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం శాసనసభ్యులు, రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి వై. సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఈనెల మూడో తేదీ మంగళవారం నుండి ఈనెల 31వ తేదీ వరకు సచివాలయ సిబ్బందితో కలిసి ధర్మవరం నియోజకవర్గం లో ఁగ్రీవెన్స్ డేఁ ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా, 3వ తేదీ మంగళవారం కార్యక్రమం తాడిమర్రిలో ప్రారంభమవుతుంది అని తెలిపారు.గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు తమ సమస్యలను, అవగాహన దారితీసే అంశాలను సులభంగా రిజిస్టర్ చేసుకోగలుగుతారు అని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించడానికి మంత్రి, సంబంధిత అధికారులు నిబద్ధతతో పని చేస్తా రన్నారు.ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు వారి సమస్యలకు సమగ్ర పరిష్కారాలు అందించడమే ముఖ్య ఉద్దేశ్యంగా ఉంటుంది అని అన్నారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను తెలియజేయాలని తెలిపారు.
ఈనెల మూడవ తేదీ నుండి గ్రీవెన్స్ డే కార్యక్రమాలు ప్రారంభం
RELATED ARTICLES