అర్హులైన కార్మికులు కు నూతన ఇళ్ల పట్టాలు ఇవ్వాలి
అన్యక్రాంతం చేసిన వారిపై 420
కేసులు నమోదు చేయాలి
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంధ్ర ధర్మవరం;; వారం రోజుల్లో సర్వేనెంబర్ 650-2లో అక్రమ నిర్మాణాలు తొలగించకపోతే మున్సిపల్ రెవెన్యూ కార్యాలయాలను దిగ్బంధం చేస్తామని, అర్హులైన కార్మికులకు నూతన ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని, అన్యాక్రాంతం చేసిన వారిపై 420 కేసులు నమోదు చేయాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా
-పట్టణంలో ఎన్జీవోస్ నందు కార్మికుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు మాట్లాడుతూ 650-2,సర్వే నెంబర్ లో ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మికులకు అన్యాయం జరిగింది అని, అర్హులైన కార్మికులకు పట్టాలు ఇవ్వకుండా అనర్హులైన వారందరికీ పట్టాలు ఇచ్చి అర్హులైన కార్మికుల్ని రోడ్డున పడేయడం దారుణము కాదా? అని వారు ప్రశ్నించారు.గత మూడు నెలలుగా ధర్మవరం పట్టణంలో 650-2,సర్వే నెంబర్ లో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలని రెవెన్యూ అధికారులను కోరడం తో రెవెన్యూ అధికారులు స్పందించి కార్మికుల దగ్గరకు వచ్చి మీ న్యాయమైన డిమాండ్లు నెరవేరుస్తామని, 650-2 సర్వే నెంబర్ లో అనర్హులైన వారి పట్టాలను రద్దుచేసి, ఎవరైతే నిజమైన కార్మికులు ఉన్నారో వారికి వెంటనే పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. మొత్తం 76 పట్టాలను ధర్మవరం ఆర్డీవో రద్దు చేశారు అని, అయినా అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టడం సమంజసమేనా? అని వారు మండిపడ్డారు.ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగం స్పందించి అక్రమార్కులపై 420 కేసులు నమోదు చేసి, అక్రమ కట్టడాలను తొలగించి నిజమైన లబ్ధిదారులకి న్యాయం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్,ఏఐటీయూసీ కార్మిక సంఘం నాయకులు ఎర్రంశెట్టి రమణ, ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ, జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సకల రాజా, ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మిక సంఘం అధ్యక్షులు గోవిందరాజు, కార్యదర్శి అన్నం లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆంజనేయులు, తాజుద్దీన్, రామసుబ్బయ్య,రామకృష్ణ, సురేంద్ర,నాగేంద్ర,చిన్న, పీరా, జనార్ధన్, మహిళా సమైక్య లీడర్స్ లలితమ్మ,లింగమ్మ,ఈరమ్మ, తదితరులు పాల్గొన్నారు.