Monday, June 9, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిభారతీయ నాట్య శిక్షణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయము ..

భారతీయ నాట్య శిక్షణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయము ..

ముఖ్య అతిథులు
విశాలాంధ్ర ధర్మవరం;; భారతదేశంలో నాట్యమునకు సంబంధించిన వివిధ నాట్య కళలు లో శిక్షణ అనేది సాంప్రదాయాలకు నిలయము లాంటిదని ముఖ్య అతిథులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాంస్కృతిక మండలి లో పట్టణములోని ఎస్బిఐ కాలనీ మానస నృత్య కళా కేంద్రం వారి ఆధ్వర్యంలో వేసవి నాట్య శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని గురువు మానస నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కగ్గోలు హరీష్ కుమార్ ( మంత్రి గారి నియోజక వర్గ ఇంచార్జీ),కోట శంకర్రావు ( ప్రముఖ రంగస్థల , బుల్లితెర , చలన చిత్ర నటులు)మల్లాది భాస్కర్ ( రంగస్థల, సినిమా ,బుల్లితెర నటులు ),
జబర్దస్త్ అప్పారావు, తేజోమూర్తుల మురళీధర్ ( రచయిత & దర్శకులు),
అల్లరి అర్జున్ ( టి. వి & సినిమా యాక్టర్),పెద్దిపోగు ఆనంద్ ( రంగస్థల సకల వృత్తి కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్), సాంస్కృతిక మండలి వ్యవస్థాపకులు సత్రశాల ప్రసన్నకుమార్ హాజరు కావడం జరిగింది. గురువు మానస ద్వారా 50 మంది చిన్నారులు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత, వారు నేర్చిన నాట్యమును ప్రదర్శించడం జరిగింది. ఈ ప్రదర్శన అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలోశ్రీ విజ్ఞరాజం భజే,
“మహిషాసుర మర్దిని “,
నీలి మేఘములలో
నగుమోము కలవాడే,
అదివో అల్లదివో ,
చిన్ని శిశువు,లాంటి నాట్యములు ఎంతో ఉత్సాహభరితంగా ప్రదర్శన ఇవ్వడం ప్రేక్షకులను మైమరిచే విధంగా జరిగాయి.
అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ అతి చిన్న వయసులో గురువు మానస తాను నేర్చిన నాట్యమును ఇతరులకు నేర్పించాలన్న తపన, ఆకాంక్ష ఉండడం, చదువులో కూడా దిట్టగా ఉండడం నిజంగా భగవంతుడు ఇచ్చిన వరము అని తెలిపారు. ఇప్పటికే పలు జిల్లాలలో రాష్ట్రాలలో వీరి నాట్య ప్రదర్శన మంచి గుర్తింపు పొందడం మన ధర్మావరానికే గర్వ కారణమని వారు తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, మెమొటోలు అందజేశారు. తదుపరి ముఖ్య అతిథులను గురువు మానస ఘనంగా సత్కరించారు. తదుపరి మానస ప్రదర్శించిన వారి శిష్య బృందం ను మెచ్చి, మానసను కూడా ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, కళాకారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు