Homeఅంతర్జాతీయంఅమెరికాలో భారత ‘మ్యాంగో మ్యాజిక్’

అమెరికాలో భారత ‘మ్యాంగో మ్యాజిక్’

- Advertisement -


అక్కడి వారిని ఆకర్షిస్తున్న ఇక్కడి పండ్ల రుచులు
న్యూయార్క్:
భారత మామిడి పండ్లు అమెరికన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. దీనితో అమెరికా మార్కెట్లు భారత మామిడి పండ్లతో కళకళలాడుతున్నాయి. భారత్ నుంచి దిగుమతయ్యే విభిన్న రుచుల పండ్ల కోసం ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మామిడి ఎగుమతులపై అమెరికా మార్కెట్లలో ఉన్న గిరాకీ గురించి అవగాహన కల్పించేందుకు సియాటెల్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘మ్యాంగో మ్యాజిక్: ప్రమోషన్ అండ్ టేస్టింగ్ ఈవెంట్ ఆఫ్ ఇండియన్ మ్యాంగోస’ పేరుతో నిర్వహించిన ఈ వేడుకకు 100 మందికిపైగా భారత మామిడి పండ్ల దిగుమతిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులకు కాన్సులేట్ ప్రతినిధులు మహారాష్ట్రకు చెందిన ఆల్ఫాన్సో, కేసర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బంగినపల్లి, హిమాయత్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన లాంగ్డా, దశహరీ, గుజరాత్‌కు చెందిన రైప్ రాజాపురి పండ్ల రుచులను అతిథులకు చూపించారు. కోస్ట్‌కో వైస్ ప్రెసిడెంట్ బాబ్ హస్కీ మాట్లాడుతూ…కేసర్ మామిడి పండ్లను స్టోర్లలో పెట్టిన రెండు గంటలకే అమ్ముడుబోతున్నాయని తెలిపారు. మామిడి ఎగుమతుల్లో భారత్‌దే అధిక వాటా. సుమారుగా 2.6 కోట్ల టన్నుల 1,000 రకాలకుపైగా మామిడి పండ్లను ఎగుమతి చేస్తోంది. అమెరికాకు 2007 నుంచి భారత్ నుంచి మామిడి ఎగుమతులు ఏటా పెరుగుతున్నాయి. 2023-24లో ఈ మార్కెట్ విలువ రూ.94.95 కోట్లగా ఉండగా అది ముందటి ఏడాది కంటే 130 శాతం ఎక్కువ.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు