Homeఆంధ్రప్రదేశ్గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి కీలక మార్పులు..ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఏపీపీఎస్సీ!

గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి కీలక మార్పులు..ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఏపీపీఎస్సీ!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 పరీక్ష విధానంలో కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది.దీనికి సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.
ఈ సవరణలు ఆమోదం పొందితే, భవిష్యత్తులో విడుదలయ్యే నోటిఫికేషన్ల నుంచే అమలులోకి వచ్చే అవకాశముంది.

ప్రస్తుతం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లు (జనరల్ స్టడీస్, జనరల్ అప్టిట్యూడ్) ఉంటాయి.
ఒక్కోటి 120 మార్కులకు నిర్వహిస్తున్నారు. అయితే కొత్త ప్రతిపాదనల ప్రకారం, ఈ రెండింటిని కలిపి ఒకే పేపర్‌గా నిర్వహించనున్నారు.మొత్తం మార్కులు 150గా నిర్ణయించే ఆలోచనలో ఉంది కమిషన్. ఇందులో జనరల్ స్టడీస్ 75, జనరల్ అప్టిట్యూడ్ 75 మార్కుల చొప్పున విభజించనున్నారు.పరీక్ష వ్యవధి రెండు గంటలన్నరగా ఉండగా, తప్పు సమాధానాలకు 1/3 నెగటివ్ మార్కింగ్ వర్తింపజేయనున్నారు.
ఇందులో వివిధ అంశాలకు 140 మార్కులు, డేటా అనలిసిస్‌కి ప్రత్యేకంగా 10 మార్కులు కేటాయించేలా ప్రతిపాదించారు.

ఇప్పటి వరకు మెయిన్స్‌లో తెలుగు,ఇంగ్లీష్ భాషలకు వేర్వేరు అర్హత పరీక్ష పేపర్లు ఉండేవి.
ఒక్కో పేపర్ 150 మార్కులు ఉండేది. కానీ అభ్యర్థుల సౌకర్యార్థం ఇప్పుడు వీటిని ఏకీకృతం చేసి, ఒకే ప్రశ్నపత్రంగా 150 మార్కులకు నిర్వహించాలని యోచిస్తున్నారు.ఇందులో తెలుగు 75, ఇంగ్లీష్ 75 మార్కులుగా రెండు విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగంలో కనీసం 30 మార్కులు సాధించడం తప్పనిసరి అవుతుంది.

మెయిన్స్ పేపర్-3లో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లా ఇన్ ఇండియా అనే విభాగంలో మార్పులు చేసి, రాజకీయాలు, రాజ్యాంగం, పాలన, నైతిక విలువలు వంటి అంశాలను చేర్చనున్నారు.పేపర్-5లో పర్యావరణ సమస్యలను కొత్తగా చేర్చాలని ప్రతిపాదించారు.కొత్త విధానంలో మెయిన్స్ రాత పరీక్ష ఐదు పేపర్లకు 750 మార్కులు, ఇంటర్వ్యూకు 75 మార్కులు కేటాయించారు.మొత్తం 825 మార్కుల కోసం ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఆమోదం తెలపగానే మార్పులు అమల్లోకి వస్తాయి. తద్వారా రాబోయే గ్రూప్-1 నోటిఫికేషన్లలో అభ్యర్థులు ఈ కొత్త విధానాన్నే అనుసరించాల్సి ఉంటుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు