అమరావతికి పెట్టుబడులు రాకుండా కుట్ర పన్నుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; మహిళల వ్యక్తిత్వ హనంపై మీడియా డిబేట్లో మాట్లాడడం దుర్మార్గమైన చర్య అని, తక్షణమే సాక్షి మీడియాను ప్రెస్ కౌన్సిల్ నుండి బహిష్కరించాలని తెలుగుదేశం మహిళా నాయకురాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ సాక్షి మీడియా డౌట్ తక్షణమే సాక్షి యాజమాన్యం రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ క్షమాపణ చెప్పాలన్న నినాదాలతో ముందుకు దూసుకుపోవడం జరిగిందన్నారు. ఇటువంటి డిబేట్లు పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్న తరుణంలో అమరావతికి పెట్టుబడును రాకుండా రకరకాలుగా అమరావతిపై జగన్ అండ్ కో విషయం చిమ్ముతోందని మహిళలు మండిపడ్డారు. తదుపరి కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణంరాజులతో కూడిన దిష్టిబొమ్మను, సాక్షి పేపర్లను కళాజ్యోతి సర్కిల్లో పెట్రోల్ పోసి దహనం చేశారు. ఇలాంటివి భవిష్యత్తులో జరిగితే తప్పకుండా ఎదుర్కొంటామని మహిళలు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళలు వందలాదిమంది పాల్గొన్నారు.