Homeఅంతర్జాతీయంయూకే వలస విధానంలో భారీ మార్పులు.. భారతీయులపై తీవ్ర ప్రభావం!

యూకే వలస విధానంలో భారీ మార్పులు.. భారతీయులపై తీవ్ర ప్రభావం!

- Advertisement -

గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా బ్రిటన్ ప్రభుత్వం తమ వలస విధానంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. కీర్ స్టార్మర్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త నిబంధనల ప్రకారం, చట్టబద్ధమైన వలసదారులు సైతం దేశంలో శాశ్వతంగా స్థిరపడటానికి (సెటిల్‌మెంట్) దరఖాస్తు చేసుకోవాలంటే 20 ఏళ్ల వరకు వేచి ఉండాల్సి రావచ్చు. దేశానికి, ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే వారికి, నిబంధనలు పాటించే వారికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ సంస్కరణలు చేపట్టినట్లు హోం సెక్రటరీ షబానా మహమూద్ స్పష్టం చేశారు.ప్రతిపాదిత కొత్త విధానం ప్రకారం, వివిధ రంగాల వారికి వేర్వేరు కాలపరిమితులుంటాయి. నేషనల్ హెల్త్ సర్వీస్ (చీనూ)లో పనిచేసే డాక్టర్లు, నర్సులు 5 ఏళ్లకే సెటిల్‌మెంట్‌కు అర్హత సాధిస్తారు. అత్యధికంగా సంపాదించేవారు, పారిశ్రామికవేత్తలు కేవలం 3 సంవత్సరాల్లోనే స్థిరపడేందుకు అవకాశం ఉంటుంది. అయితే, తక్కువ వేతనం ఉన్న కార్మికులు 15 ఏళ్లు, ప్రభుత్వ ప్రయోజనాలు (బెనిఫిట్స్) పొందే వలసదారులు 20 ఏళ్లు వేచి ఉండాలి. అక్రమ వలసదారులు, వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉన్నవారు స్థిరపడాలంటే 30 ఏళ్లు ఆగాల్సి ఉంటుంది.

ఈ మార్పులు 2021 నుంచి యూకేకి వచ్చిన దాదాపు 20 లక్షల మంది వలసదారులపై ప్రభావం చూపనున్నాయి. వీరిలో అత్యధిక నైపుణ్యం కలిగిన వలసదారులుగా ఉన్న భారతీయుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. అయితే, ఇప్పటికే సెటిల్డ్ స్టేటస్ పొందిన వారికి ఈ నిబంధనలు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కొత్త ప్రణాళికలపై 12 వారాల పాటు ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.

మరో కీలక మార్పు ఏంటంటే, వలసదారులకు ప్రభుత్వ ప్రయోజనాలు, సామాజిక గృహ వసతి వంటివి సెటిల్‌మెంట్ పొందిన వెంటనే కాకుండా, బ్రిటిష్ పౌరసత్వం పొందాకే లభిస్తాయి. ఁబ్రిటన్‌లో స్థిరపడటం అనేది హక్కు కాదు, అదొక అదృష్టం. దాన్ని సంపాదించుకోవాలిఁ అని హోం సెక్రటరీ షబానా మహమూద్ వ్యాఖ్యానించారు. ఈ సంస్కరణలు యూకే సెటిల్‌మెంట్ విధానాన్ని ఐరోపాలోనే అత్యంత కఠినమైనదిగా మార్చనున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు