Monday, June 9, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయియోగాంధ్రా కార్యక్రమమును విజయవంతం చేయండి.. ఆర్డీవో మహేష్

యోగాంధ్రా కార్యక్రమమును విజయవంతం చేయండి.. ఆర్డీవో మహేష్

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఈ నెల 11వ తేదీ బుధవారం ఉదయం 6:45 నిమిషాల నుండి 7;45 నిమిషాల వరకు యోగ ఆంధ్ర కార్యక్రమములో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు ఆర్డీవో మహేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ హాజరవుతున్నట్లు వారు తెలిపారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈ యోగాంతర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం యోగా వలన కలుగు ఉపయోగాలు, వాటి ప్రాధాన్యత గురించి కలెక్టర్ యొక్క ప్రసంగం ఉంటుందని వారు తెలిపారు. కావున ప్రజలు, వివిధ ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, యోగా శిక్షకులు, నిర్వాహకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు