ఖరీఫ్పై ‘ఎల్నినో’ దెబ్బ
- దేశవ్యాప్తంగా లోటు వర్షపాతం
- పంటల సాగు ప్రశ్నార్థకం
- గణనీయంగా తగ్గిన వరి, నూనెగింజల సాగు
- తీవ్ర ఆందోళనలో రైతులు
న్యూదిల్లీ: రుతుపవనాలను నియంత్రిస్తున్న ఎల్నినో పరిస్థితులు దేశంలో కీలకమైన ఖరీఫ్ సాగుపై అత్యంత తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆలస్యంగా, అస్తవ్యస్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, పత్తి వంటి కీలక పంటల సాగు విస్తీర్ణం గత ఏడాది కంటే వెనుకబడింది. ఈ రుతుపవన కాలంలో ఇప్పటివరకు దేశంలో సగం కంటే ఎక్కువ జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయింది. ఇది గంగా నదీ తీరంలోని వరి సాగు ప్రాంతాలు సహా అనేక ప్రధాన వ్యవసాయ రాష్ట్రాల్లోని ఖరీఫ్ సాగుకు గండి కొడుతోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం జులై 10 నాటికి రైతులు 531.25 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంటలు వేశారు. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సుమారు 16 శాతం తక్కువ. అనేక వర్షాధార రాష్ట్రాల్లో నాట్లు మందగించడాన్ని ప్రతిబింబిస్తూ, సాధారణ సాగు విస్తీర్ణం (2021-25 సగటు) కంటే 1.8 మిలియన్ హెక్టార్లు తక్కువగా ఉంది. వరి సాగు అత్యంత తీవ్రంగా క్ష్మీణించింది. ఈ పరిస్థితుల్లో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. అయితే పాలకులకు మాత్రం ఏ మాత్రం పట్టడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గణాంకాల ప్రకారం, జులై 13 నాటికి దేశంలోని 741 జిల్లాల్లో 397 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయింది. ఇందులో 326 జిల్లాల్లో వరüపాత లోటు ఉండగా, 71 జిల్లాల్లో భారీ లోటు ఉంది. కేవలం 219 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, 97 జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ, 24 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయింది. గంగా మైదాన ప్రాంతాలలో ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్ భాగాలలో వరüపాత లోటు తీవ్రంగా ఉంది. ఇక్కడ వరి సాగు సమయానుకూల రుతుపవన వర్షాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. జులై ద్వితీయార్థంలో ఈ ప్రాంతాలకు తగినంత వర్షం పడకపోతే, అది వరి సాగు, భూగర్భ జల మట్టాలు, మొత్తం ఖరీఫ్ పంట ఉత్పత్తిపై ప్రభావం చూపవచ్చు.
వరి సాగుపై ఒత్తిడి
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అందించిన వివరాల ప్రకారం జులై 10, 2026 నాటికి 11.47 మిలియన్ హెక్టార్లలో వరి సాగు జరిగింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 12.55 మిలియన్ హెక్టార్లతో పోలిస్తే ఇది 1.08 మిలియన్ హెక్టార్లు తక్కువ. వరి నాట్లు వేయడానికి జులై మొదటి, రెండవ పక్షం రోజులు కీలకమైనవిగా పరిగణించబడతాయి. ఈ కాలంలో వర్షపాతం లోపం దీర్ఘకాలం కొనసాగితే, సాగునీటి అవసరం పెరుగుతుంది. వర్షాధార ప్రాంతాల్లో నాట్లు వేయడం ఆలస్యం కావచ్చు లేదా తగ్గవచ్చు. ఈ ఏడాది మొత్తం ఖరీఫ్ సాగు కూడా గత ఏడాదితో పోలిస్తే వెనుకబడి ఉంది.
ఉత్తర ప్రదేశ్, బీహార్ జిల్లాల్లో భారీ లోటు
గంగా మైదాన ప్రాంతాలు ఎల్నినో ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నాయి. ఉత్తర ప్రదేశ్లోని మొత్తం 75 జిల్లాల్లో 31 జిల్లాలు ‘వరüపాత లోపం’ ఉన్న వర్గంలోనూ, తొమ్మిది జిల్లాలు ‘భారీ వరüపాత లోపం’ ఉన్న వర్గంలోనూ ఉన్నాయి. గంగా నదీ తీరంలోని అనేక జిల్లాల్లో వర్షపాతంలో గణనీయమైన లోటు నమోదయింది. ఇక బీహార్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఆ రాష్ట్రంలోని 38 జిల్లాల్లో 29 జిల్లాలు ‘వరüపాత లోటు’ ఉన్న వర్గంలోనూ, ఏడు జిల్లాలు ‘భారీ వరüపాత లోటు’ ఉన్న వర్గంలోనూ ఉన్నాయి. కేవలం రెండు జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదయింది. జార్ఖండ్లో వర్షపాతం లోటు రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. వరüపాత లోటు గంగా మైదానాలకే పరిమితం కాలేదు. తెలంగాణలో 25 జిల్లాలు, కర్నాటకలో 21 గుజరాత్లో 21, మహారాష్ట్రలో19, అసోంలో 22 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంది. పంజాబ్లో 11 జిల్లాలు లోటు వర్గంలో, రెండు జిల్లాలు తీవ్ర లోటు వర్గంలో ఉండగా, ఆరు జిల్లాలలో సాధారణ వర్షపాతం నమోదయింది. హర్యానా పరిస్థితి మెరుగ్గా ఉంది. 22 జిల్లాలకుగాను ఆరు జిల్లాల్లో వర్షపాతం లోటుగా, రెండు జిల్లాల్లో భారీ లోటుగా, 10 జిల్లాల్లో సాధారణంగా, మూడు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువగా, ఒక జిల్లాలో అధిక వర్షపాతం నమోదయింది. దీనికి భిన్నంగా, మధ్య ప్రదేశ్లోని అనేక జిల్లాల్లో సాధారణ లేదా సాధారణం కంటే ఎక్కువ, దిల్లీలోని చాలా జిల్లాల్లో కూడా సాధారణ లేదా అంతకంటే మెరుగైన వర్షపాతం నమోదయింది. ఈ ఏడాది రుతుపవనాలు అత్యంత అస్థిరంగా ఉన్నాయని ఈ గణాంకాలు చూపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సాధారణ లేదా అధిక వర్షపాతం నమోదు కాగా, దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం లోటుగా ఉంది. గంగా మైదాన ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల్లోని అనేక జిల్లాల్లో వాతావరణ కరువు లాంటి పరిస్థితులు నెలకొని ఉండవచ్చని వరüపాత గణాంకాలు సూచిస్తున్నాయి. ఐఎండీ ప్రమాణాల ప్రకారం, ఒక సీజన్లో సాధారణం కంటే 26 శాతం నుంచి 50 శాతం తక్కువ వర్షపాతం పొందే ప్రాంతాన్ని మధ్యస్థ వాతావరణ కరవుగా పరిగణిస్తారు. 50 శాతానికి మించిన లోటును తీవ్ర వాతావరణ కరవుగా వర్గీకరిస్తారు. అయితే కేవలం తక్కువ వర్షపాతం నమోదయినంత మాత్రాన అధికారికంగా కరువును ప్రకటించరు. ఒక ప్రాంతాన్ని కరవు పీడిత ప్రాంతంగా ప్రకటించే ముందు పంట పరిస్థితి, నేలలోని తేమ, నీటి లభ్యత వంటి ఇతర అంశాలను కూడా అంచనా వేస్తారు.
ప్రభావితమైన ఇతర ఖరీఫ్ పంటలు
బలహీనమైన, అస్తవ్యస్తమైన రుతుపవనాల కారణంగా అనేక రకాల పంటలలో విత్తనాలు వేయడం ప్రభావితమైంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, గత ఏడాదితో పోలిస్తే నూనెగింజల సాగు 3.13 మిలియన్ హెక్టార్లు తగ్గడంతో ఈ రంగంలోనే అత్యధిక క్షీణత నమోదయింది. ధాన్యాలు, ముతక ధాన్యాల సాగు 2.86 మిలియన్ హెక్టార్లు, పప్పు ధాన్యాల సాగు 1.72 మిలియన్ హెక్టార్లు, పత్తి సాగు 1.44 మిలియన్ హెక్టార్లు, వరి సాగు 1.08 మిలియన్ హెక్టార్లు తగ్గింది. నూనెగింజల పంటలలో సోయాబీన్, వేరుశనగ సాగు తగ్గింది. పప్పు ధాన్యాల పంటలలో కంది, మినుముల సాగు ప్రభావితమైంది. ముతక ధాన్యాల పంటలలో జొన్న, మొక్కజొన్న సాగు కూడా తగ్గింది. చెరకు సాగు దీనికి మినహాయింపు. గత ఏడాదితో పోలిస్తే ఈ రంగంలో సాగు 860,000 హెక్టార్లు పెరిగింది. జనపనార, మెస్తా సాగులో కూడా స్వల్ప పెరుగుదల నమోదైంది.


