Homeజిల్లాలుశ్రీ సత్యసాయినేత్రదానం చేసిన సురుపు వరలక్ష్మీ సరోజమ్మ

నేత్రదానం చేసిన సురుపు వరలక్ష్మీ సరోజమ్మ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని శారదా నగర్కు చెందిన కీర్తిశేషులు సురువు నాగరాజు మరణించి నేటికి 13 రోజులు జరగకుండానే భార్య కీర్తిశేషులు సురువు వరలక్ష్మి సరోజమ్మ (50) ఆదివారం మృతి చెందింది. ఇటువంటి సమయంలో విశ్వదీప సేవా సంఘం సభ్యులు నేత్రదానంపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. దీంతో కుటుంబ సభ్యులు నేత్రదానంపై అంగీకారం తెలపడంతో జిల్లా అంధత్వ నివారణ సంస్థ, అనంతపురం రెడ్ క్రాస్ సొసైటీ డివై కుళ్ళాయప్ప, కంటి రిటైవల్ సెంటర్ సహకారంతో టెక్నీషియన్ రాఘవేంద్ర విశ్రాంత కంటి వైద్య నిపుణులు సంకారపు నరసింహులు, కంటి కార్నియా సేకరించారు. నేత్రదానానికి సహకరించిన కుమారుడు అశ్వత్ నారాయణ, సూర్యనారాయణ కుమార్తె నాగేశ్వరి, బావ సత్యనారాయణ, తమ్ముళ్లు పార్థసారథి జై చంద్ర తిమ్మరాజు లకు విశ్వవిభ సేవా సంఘం వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకులు కోళ్ల మొరం చంద్రశేఖర్ రెడ్డి, అధ్యక్షులు గాజుల సురేష్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ,జూజారు రఘు ,టీచర్ లక్ష్మీనారాయణ, ఆది, కేశవరెడ్డి, ఆదినారాయణ, వెంకటరమణ బాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు