మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక.
విశాలాంధ్ర ధర్మవరం;; పొగాకు ఆకర్షణ వెనక ఉన్న నిజాన్ని బహిర్గతం చేయాలని పొగాకులో ఉండే నికోటిన్ ఉత్పత్తులపై పరిశ్రమల యొక్క అసత్య ప్రకటన బహిర్గతం చేయాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోవైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ధర్మవరం కొత్తపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొగాకు పదార్థాల వాడడం నిషిద్ధం మీద మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటాము అని, ఇందులో భాగంగా పొగాకు వ్యతిరేక దినోత్సవం మాసోత్సవాలు సందర్భంగా పొగ త్రాగటం,పొగాకు నమలడం, వలన కలిగే ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలపై ప్రజలలో అవగాహన ప్రజలకు కల్పించడం జరిగిందన్నారు. పొగ త్రాగడం, పొగాకు నమలడం వీటిని తగ్గించి, పూర్తిగా మాన్పించేందుకు మనము ప్రోత్సహించాలని తెలిపారు. అలాగే నికోటిన్ ఉత్పత్తి తయారీదారుల కంపెనీలు నూతన తరాన్ని ఎలా ఆకర్షిస్తున్నారు? తప్పుడు ప్రకటనల ద్వారా ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారో? యువతకు, సామాన్యులను ఆరోగ్యకరమైన నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించాలి అని తెలిపారు. పొగాకు సంబంధించి ఉత్పత్తులను తయారు చేస్తున్న కంపెనీలు మోసమును ప్రజలకు తెలియజేయాలి అని వారు స్పష్టం చేశారు. పొగాకు వాడకం- పర్యావరణానికి ముప్పు అని,పొగాకు పై ప్రచారం- నిషిద్ధం అని, బీడీ, సిగరెట్ కాల్చవద్దు అని, -క్యాన్సర్ వ్యాధులు తెచ్చుకోవద్దు అని తెలిపారు. స్మోకింగ్ కి నో చెప్పు -ఆరోగ్యానికి ఎస్ చెప్పు… అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది అన్నారు. కోప్టా -2003 యాక్ట్ ప్రకారం బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేస్తే 200 రూపాయలు జరిమానా విధిస్తున్నారు అని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలను పొగాకు రహిత ప్రాంతంగా మార్చడానికి ప్రతి ఒక్కరు చేతులు కలపాలని తెలిపారు. తరువాత రైల్వే స్టేషన్ దగ్గర ఆటో డ్రైవర్లకు పొగాకు వాడడం వల్ల వచ్చే నష్టాలు గురించి అలాగే టిటిసి సెంటర్( టొబాకో సిజేషన్ సెంటర్ ) గురించి తెలియజేయడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్.టి. సి. పి. సామాజిక కార్యకర్త శమంతకమణి, ఎం.పి హెచ్. ఎ.. మోహన్ కుమార్, సి. ఓ. మారుతికుమార్, ఫార్మసిస్ట్ .శ్రీనివాస్ రెడ్డి, సచివాలయ ఆరోగ్య కార్యకర్తలు. ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు
పరిశ్రమల అసత్య ప్రకటనలను బహిర్గతం చేయాలి..
RELATED ARTICLES