చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు షర్మిల కీలక విన్నపం
దివంగత కాంగ్రెస్ నేత వంగవీటి మోహన రంగా పేరును విజయవాడ పశ్చిమ బైపాస్ జాతీయ రహదారికి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగా 78వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఆయనకు నివాళులర్పించిన ఆమె, ఈ మేరకు కూటమి ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను ఉద్దేశించి ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. పేదల పక్షపాతిగా, వారి అభ్యున్నతే లక్ష్యంగా తుది శ్వాస వరకు పోరాడిన గొప్ప నేత వంగవీటి మోహన రంగా. ఆయన జ్ఞాపకార్థం విజయవాడ బైపాస్కు ఆయన పేరు పెట్టాలి అని షర్మిల కోరారు. కాజ టోల్ గేట్ నుంచి చిన్న అవుటుపల్లి వరకు ఉన్న 47.8 కిలోమీటర్ల ఈ రహదారికి ావంగవీటి మోహన రంగా జాతీయ రహదారి్ణగా నామకరణం చేయాలని ఆమె సూచించారు. ఈ డిమాండ్ను గతంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిందని, ఇప్పుడు రంగా జయంతి సందర్భంగా మరోసారి గుర్తు చేస్తున్నట్లు షర్మిల స్పష్టం చేశారు.