అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన సుంకాలను తగ్గించనున్నట్లు ముఖ్య వ్యాఖ్యలు చేశారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తమకు ఉన్న అద్భుతమైన అనుబంధాన్ని ఆయన మరోసారి స్పష్టం చేశారు.ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ ఒక ప్రధాన ఆర్థిక,వ్యూహాత్మక భద్రతా భాగస్వామిగా ఉన్నదని ట్రంప్ పేర్కొన్నారు.భారత్కు అమెరికా రాయబారిగా నియమితుడైన సెర్జియో గోర్ సోమవారం శ్వేతసౌధంలో ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంలో ట్రంప్ మాట్లాడుతూ,మోదీతో తన సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని అన్నారు.
న్యాయమైన, సమానమైన ఒప్పందం సాధించబోతున్నాం: ట్రంప్
సెర్జియో గోర్ రాయబారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య బంధం మరింత పటిష్ఠమవుతుందని, అమెరికా పరిశ్రమలు,సాంకేతిక రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు, అమెరికా ఎనర్జీ ఎగుమతులను విస్తరించేందుకు, భద్రతా సహకారాన్ని మరింతగా పెంచేందుకు ఆయన కృషి చేస్తారని ట్రంప్ నమ్మకం వ్యక్తం చేశారు.మేము భారత్తో ఒక కొత్త ఒప్పందాన్ని సిద్ధం చేస్తున్నాం. ఇది గత ఒప్పందాలకంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం వారు మాపై కొంత అసంతృప్తిగా ఉన్నా, త్వరలో మళ్లీ మమ్మల్ని ఇష్టపడతారు.న్యాయమైన, సమానమైన ఒప్పందం సాధించబోతున్నాం,ఁ అని ట్రంప్ పేర్కొన్నారు.భారత్పై అమెరికా మొదట 25 శాతం సుంకం విధించగా, అనంతరం దాన్ని 50 శాతానికి పెంచిన విషయం తెలిసిందే.


