- Advertisement -
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యదర్శివర్గాన్ని విజయవాడ దాసరిభవన్లో పి.రామచంద్రయ్య అధ్యక్షతన బుధవారం జరిగిన రాష్ట్ర సమితి సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్యతోపాటు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా జేవీ సత్యనారాయణమూర్తి, పి.హరినాథరెడ్డి, కేవీవీ ప్రసాద్, డి.జగదీశ్, జంగాల అజయ్కుమార్, డేగా ప్రభాకర్, తాటిపాక మధు, పి.దుర్గాభవాని, కె.రామాంజనేయులు, శాశ్వత ఆహ్వానితులుగా ముప్పాళ్ల నాగేశ్వరరావు, అక్కినేని వనజ ఎన్నికయ్యారు.


