Friday, May 2, 2025
Homeజాతీయంమార్పు గుజరాత్ నుంచే ప్రారంభం : రాహుల్ గాంధీ

మార్పు గుజరాత్ నుంచే ప్రారంభం : రాహుల్ గాంధీ

గుజరాత్ తో పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు
బీజేపీ, ఆరెస్సెస్ ను ఓడించే శక్తి కాంగ్రెస్ కు మాత్రమే ఉందన్న రాహుల్

గుజరాత్ లో పార్టీని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో… ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్ లో సత్తా చాటి పునర్వైభవాన్ని సాధించాలనే కృత నిశ్చయంతో ఉంది. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం గురించి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ… బీజేపీ, ఆరెస్సెస్ ను కేవలం కాంగ్రెస్ మాత్రమే ఓడించగలదని చెప్పారు. గుజరాత్ పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.మార్పు గుజరాత్ నుంచే ప్రారంభమవుతుందని రాహుల్ అన్నారు. పార్టీ అంతర్గత సమస్యలను పరిష్కరించేందుకు నూతన నాయకత్వాన్ని తీసుకొస్తామని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పోరాటం కేవలం రాజకీయపరమైనదే కాదని, సిద్ధాంతపరమైనది కూడా అని తెలిపారు. బీజేపీ, ఆరెస్సెస్ లకు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఓడిస్తుందనే విషయం ప్రజలకు కూడా తెలుసని చెప్పారు. నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీని దెబ్బతీస్తోందని రాహుల్ అన్నారు. తమ వద్ద రెండు రకాల గుర్రాలు ఉన్నాయని… వీటిలో ఒక రకం రేసు గుర్రాలని, రెండో రకం పెళ్లిళ్లకు తీసుకెళ్లే గుర్రాలని తెలిపారు. పెళ్లిళ్లకు వెళ్లాల్సిన గుర్రాలను కాంగ్రెస్ పార్టీ కొన్నిసార్లు రేసులకు పంపుతోందని… రేసు గుర్రాలను కొన్నిసార్లు పెళ్లళ్లకు పంపుతోందని చెప్పారు. ఈ గుర్రాలను విభజించాల్సిన అవసరం ఉందని… పరిస్థితిని మారుస్తామని తెలిపారు. సరైన నేతలకు సరైన బాధ్యతలను అప్పగిస్తామని అన్నారు. కొందరు నేతలు బీజేపీకి దగ్గరగా ఉంటున్నారని… అలాంటి వారిని దూరం పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు