Saturday, June 7, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివాసవి కళాశాల విద్యార్థినీలకు ప్రతిభా పురస్కారాలు..

వాసవి కళాశాల విద్యార్థినీలకు ప్రతిభా పురస్కారాలు..

విశాలాంధ్ర -ధర్మవరం;; పట్టణంలోని వాసవి కళాశాల విద్యార్థినిలకు ప్రతిభా పురస్కారు లభించడం జరిగిందని, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులకు ప్రభుత్వం వివిధ కేటగిరీల కింద ప్రతిభా పురస్కారాలను ప్రకటించడం జరిగిందని వాసవి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఈశ్వరయ్య, డైరెక్టర్ భాస్కర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా మొత్తం 39 మందికి ఈ అవార్డు ఎంపిక కావడం జరిగిందన్నారు. ఇందులో ధర్మవరానికి చెందిన వాసవి జూనియర్ కళాశాలకు చెందిన బీసీ కేటగిరికి చెందిన శాంతియ బైపిసి లో 987 మార్కులు, జనరల్ కేటగిరీలో అరిగెల దివ్య బైపీసీలో 984, ఎస్సీ కేటగిరిలో మౌనిక ఎంపీసీలో 979 మార్కులు, దివ్యాంగుల విభాగంలో షేక్ నాజియా సీఈసీ లో 832 మార్కులను కైవసం చేసుకొని ఎంపిక చేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినీలను ప్రిన్సిపాల్ డైరెక్టర్ తో పాటు అధ్యాపకులు కూడా అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు