Friday, June 6, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజూన్ నెల రెండవ ,నాల్గవ వారములలో ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహణ ..

జూన్ నెల రెండవ ,నాల్గవ వారములలో ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహణ ..

ఎంపీడీవో సాయి మనోహర్
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ కలెక్టర్ ఆదేశాల మేరకు జూన్ నెల రెండవ, నాల్గవ వారములలో ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహణ ఉంటుందని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వయసు గల వారందరికీ ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరిగా చేసేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు ,సచివాలయాలలో ఆధార్ ప్రత్యేక క్యాంపులు కూడా నిర్వహిస్తామని తెలిపారు. జూన్ నెలలో 10 నుండి 13వ తేదీ వరకు, అదేవిధంగా జూన్ నెల 24వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఈ ఆధార్ ప్రత్యేక క్యాంపుల నిర్వహణ ఉంటుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా ఈ ఆధార్ ప్రత్యేక క్యాంపుల పట్ల ప్రత్యేక శ్రద్ధను కనపరచాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు