విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణ ప్రభుత్వాసుపత్రిలో ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలను అందించేందుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సహకారంతో నూతనంగా నిర్మించబోయే బ్లాక్టాప్ (బీటీ) రోడ్ పనులకు భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి, వైద్య సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆసుపత్రిలో రోజుకు వేలాది మంది రోగులు వస్తుండగా, రోడ్డు సదుపాయం వర్షాకాలంలో అత్యంత దయనీయ స్థితిలో ఉండటం వల్ల రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని తెలిపారు. ప్రజల విజ్ఞప్తి మేరకు, మంత్రి వెంటనే స్పందించి బీటీ రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఆసుపత్రి పరిసరాల్లో తగిన రహదారి సౌకర్యం ఉండకపోవడం వల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకే ఈ రోడ్డు నిర్మాణం చేపట్టబడుతోంది అని తెలిపారు. మంత్రి మార్గదర్శకతలో ధర్మవరం ప్రభుత్వాసుపత్రిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి తీరుతామని వారు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా అమలు చేయనున్నాం అని భరోసా ఇచ్చారు. తదుపరి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, ప్రభుత్వానికి, మంత్రి సత్య కుమార్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ధర్మవరం ప్రజల ఆరోగ్య భద్రత కోసం తీసుకుంటున్న ఈ చర్యలు ప్రజల నుండి ప్రశంసలు పొందుతున్నాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ మాధవి, వైద్య సిబ్బంది, బిల్లే శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం ప్రభుత్వాసుపత్రిలో బీటీ రోడ్ నిర్మాణానికి భూమిపూజ
RELATED ARTICLES