Homeజిల్లాలుఅనంతపురంప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేట్ పరం వద్దు

ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేట్ పరం వద్దు

- Advertisement -

విశాలాంధ్ర, ఉరవకొండ : ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ఏఐఎఫ్ డీఎస్ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు తరుణ్, మండల కార్యదర్శి మధు తెలిపారు. సోమవారం ఉరవకొండలో ప్రజా సమస్యల వేదిక కార్యక్రమంలో తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం మెడికల్ కళాశాలలను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందన్నారు.దీనివల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో లేకుండా పోతుందని ఇది వైద్య విద్యను వ్యాపారం చేయడమేనని ఆరోపించారు. 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 10 కళాశాలలను ప్రైవేట్ సంస్థలకు( పీపీపీ) విధానంలో అప్పగించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు