- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని తుంపర్తి గ్రామంలో అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి సాయినాథరెడ్డి ఆధ్వర్యంలో ధర్మవరం మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో ధర్మవరం నూతన మండల అధ్యక్షుడిగా పి.సాయి, ఉపాధ్యక్షులుగా సాయి, సహాయ కార్యదర్శిగా రాకేష్ సుహేర్ సుదానంద్ మారుతిని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీ వారు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తామని తెలిపారు.


