Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిద్యుత్ షాక్ తో యువకుడు మృతి

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

- Advertisement -

విశాలాంధ్ర, గోరంట్ల,.. బేల్దారు పనికి వెళ్లి విద్యుత్ షాక్ కొట్టడంతో కూలి పనికి వెళ్ళిన యువకుడు మృతి చెందిన సంఘటన గోరంట్ల మండలంలో చోటు చేసుకుంది, సీఐ బోయ శేఖర్ తెలిపిన వివరాల మేరకు…గోరంట్ల మండలంలోని సిరగంవాళ్లపల్లి గ్రామానికి చెందిన శివశంకర్ కుమారుడు కే. మంజునాథ్ (23) అనే యువకుడు చదువుకోవడంతోపాటు కూలి పనులకు వెళ్తున్నారు. బూదిలి వాండ్లపల్లి గ్రామంలో గల కాలనీలో ఇంటి పనికి వెళ్లగా నీళ్లు అవసరం కావడంతో మోటార్ స్విచ్ వేయడానికి వెళ్లి విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు