మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
విశాలాంధ్ర -ధర్మవరం : రాబోయే కాలంలో ధర్మవరం చరిత్రను తిరగ రాస్తాను అని, విమర్శలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారి స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ విమర్శలు చేస్తున్న వారికి తగిన బుద్ధి ప్రజలే చెబుతారు అని వారు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గడ్డం కుళ్లాయప్ప, అగిలే శంకర్ రెడ్డి పెద్దిరెడ్డి శ్రీనివాసులు కేతిరెడ్డి క్యాంపు కార్యాలయంలో అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని గజమాలతో ఘనంగా సన్మానించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో గుడ్ మార్నింగ్ ధర్మవరంలో ప్రజల సమస్యలు తీరుస్తూ ఉంటే కబ్జాలు చేస్తున్నారంటూ ప్రచారం చేయడం తగదన్నారు. గత ఒకటిన్నర సంవత్సరాలుగా ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి దరఖాస్తులు ఇస్తున్నారని మరి ఒకటైన మీరు పరిష్కారం చూపించారా అని వారు ప్రశ్నించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తాను ఉన్నప్పుడు నడుపుతూ భద్రత కూడా కల్పించడం జరిగిందన్నారు. నేటి ఎన్డీఏ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు చొప్పున ఇస్తామని ఇంతవరకు ఎందుకు ఇవ్వలేక పోయిందని వారు ప్రభుత్వాన్ని మరోసారి ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు, అమలు చేసిన వాటికి ఏమాత్రం పొంతన లేదని తెలిపారు. మెనీ పోస్ట్ లో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీని అని వారు స్పష్టం చేశారు. కూటమి పాలనలో ఎవరెవరు ఏమి మాట్లాడారో ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అన్ని డిజిటల్ బుక్ లో నమోదు కావడం జరిగింది అన్నారు. అన్నిటికీ రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి 2.0 లో సమాధానం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం తాము గ్రామస్థాయి నుంచి వార్డు స్థాయి వరకు కమిటీలు వేస్తున్నామని. రాబోయే మూడేళ్లలో ధర్మవరం చరిత్రను తిరగరాస్తానని కార్యకర్తలకు, నాయకులకు భరోసా ఇచ్చారు.
రాబోయే కాలంలో ధర్మవరం చరిత్ర తిరగ రాస్తా..
- Advertisement -
RELATED ARTICLES


