మోంథా తుఫాన్ రైతులకు కోలుకోలేని దెబ్బ: నల్లమిల్లి మనోజ్ రెడ్డి.
విశాలాంధ్ర – అనపర్తి : అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో తుఫాన్ వల్ల పంట చేలు నేలకొరిగాయి. ఆ పొలాలను తెలుగుదేశం పార్టీ అనపర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి శుక్రవారం వారం అయన పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వస్తుందనుకున్న సమయానికే ‘మోంథా’ తుఫాన్ రైతులకు కోలుకోలేని దెబ్బ తీసిందని తెలిపారు. పంటలు నీటమునిగి తీవ్ర నష్టాన్ని చవిచూసారని అన్నారు.ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు న్యాయం చేయాలి” అని డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటరామరెడ్డి, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నరు.


