సినీ ప్రపంచంలో సంచలనాన్ని రేపిన యానిమేషన్ చిత్రం ఃమహావతార్ నరసింహాః విడుదలైన సమయంలో,భారత్లో యానిమేషన్ సినిమాలు పెద్దగా ఆదరణ పొందవని భావన ఉండేది.
అయితే ఆ అంచనాలను పూర్తిగా తారుమారు చేస్తూ ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
అశ్విన్కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని హోం బలే సంస్థ సుమారు రూ.40 కోట్ల బడ్జెట్తో నిర్మించింది. థియేటర్లకు వచ్చిన వెంటనే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకున్న ఈ సినిమా, దేశవ్యాప్తంగా భారీ బ్లాక్బస్టర్గా నిలిచింది. దీర్ఘకాలిక ప్రదర్శనలో రూ.325 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అనేక రికార్డులను తిరగరాసింది. ఇప్పటికే తనదైన మార్క్ వేసుకున్న ఃమహావతార్ నరసింహాః ఇప్పుడు మరో అరుదైన ఘనతను అందుకుంది ు అదే ఆస్కార్ రేసులో ప్రవేశించడం.
నామినేషన్ దశను దాటితే..
ఇటీవల ప్రకటించిన ఆస్కార్ ప్రాథమిక జాబితాలో ఈ చిత్రానికి స్థానం దక్కింది.
యానిమేషన్ విభాగంలో మొత్తం 35 చిత్రాలు నామినేషన్ కోసం పోటీపడుతున్నాయి.
ఆ జాబితాలో ఃమహావతార్ నరసింహాః కూడా ఉండటం గర్వకారణం. ఈ 35 చిత్రాల్లోంచి ఒక్కటిని అధికారిక నామినేషన్ కోసం ఎంపిక చేస్తారు. ఆ ఎంపికలో ఃమహావతార్ః నిలిస్తే, ఇండియా నుంచి ఆస్కార్ నామినేషన్కు ఎంపికైన తొలి యానిమేషన్ చిత్రం అనే చరిత్ర సృష్టిస్తుంది.అంతేకాక, నామినేషన్ దశను దాటితే, అవార్డు అందుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


