- Advertisement -
విశాలాంధ్ర- ధర్మవరం; పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సైన్స్ ల్యాబ్ కు ఫ్రిజ్ సమస్య ఉండడంతో విద్యకు సంబంధించిన పరికరాలు పెట్టుకోవడానికి లేకపోయింది. ఈ విషయం తెలుసుకుని ధర్మవరం దత్తా త్రేయ సిల్క్స్ అధినేత దత్త శివ ఈ కళాశాల కు రూ 15,000 విలువ కల ఫ్రిజ్ బహుకరించారు. అందుకు కళాశాల ప్రిన్సిపాల్ ఎమ్. వనిత వాణి, కళాశాల కమిటీ తరుపున బండి వేణుగోపాల్, అధ్యాపకులు ప్రభాకర్,రామాంజనేయ రెడ్డి, మల్లికార్జున, తదితరులు దాత దత్త శివ కు కృతజ్ఞతలు తెలియజేసారు.


