బాగ్దాద్: ఇరాక్ సముద్ర జలాల సమీపంలో అమెరికా ఆయిల్ ట్యాంకర్ను సూసైడ్ బోట్తో ఇరాన్ దాడి చేసింది. అండర్ వాటర్ డ్రోన్ దాడిలో ఓ భారతీయుడు మరణించాడు. ఇరాన్ జలాల్లో ఉన్న ఖోర్ అల్ జుబైర్ పోర్టు వద్ద ఈ దాడి జరిగింది. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే ప్రతి ఇంధన ట్యాంకర్ను పేల్చివేస్తామని ఇరాన్ ముందే హెచ్చరించింది. ఆ నౌకలో ఉన్న 15 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా తరలించారు. బాగ్దాద్లోని భారతీయ ఎంబసీ ఈ విషయాన్ని పేర్కొన్నది. దాడికి పాల్పడింది తామే అని ఇరాన్ ప్రకటించింది.
పెర్షియన్ గల్ఫ్లో రెండు ఆయిల్ ట్యాంకర్లను అండర్వాటర్ డ్రోన్లతో పేల్చినట్లు వెల్లడించింది. సేఫ్సీ విష్ణుతో పాటు జెఫిరోస్ నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది.
ఇరాక్ జలాల్లో నౌకపై దాడి: భారతీయుడి మృతి
- Advertisement -
RELATED ARTICLES


