_మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు
విశాలాంధ్ర- మైలవరం(జికొండూరు): గ్రామీణ ప్రాంతాలకు నిరంతరం అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయాలనే ప్రధాన లక్ష్యంతో సబ్ స్టేషన్ ల నిర్మాణాలకు రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు, జి.కొండూరు మండలంలోని కవులూరు గ్రామంలో 33/11 కెవి విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి ఆయన శుక్రవారం శంకుస్థాపన చేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవులూరు గ్రామంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ముందుచూపుతో సబ్ స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. కవులూరులో నిర్మాణ దశలో ఉన్న జగనన్న కాలనీకి కూడా భవిష్యత్తులో ఈ ఉప కేంద్రం ఏర్పాటుతో లో ఓల్టేజీ, బ్రేక్ డౌన్ సమస్య తీరిపోనున్నాయని పేర్కొన్నారు, ఇదే గ్రామంలో డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పరిపాలన చేస్తున్నారన్నారు, ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.