సీనియర్ డివిజన్ సివిల్ జడ్జ్, చైర్మన్ వెంకటేశ్వర్లు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కోర్టులో మే 9 వ తేదీన నిర్వహించబోయే జాతీయాలోక్ అదాలత్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జూలై 11 వ తేదీన నిర్వహిస్తున్నట్లు సీనియర్ డివిజన్ సివిల్ జడ్జ్, మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్లు, జూనియర్ సివిల్ జడ్జీలు నందిని,హరీష్, తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్టు పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లో అధికారులకు, న్యాయవాదులకు సమాచారాన్ని తెలియజేయడం జరిగిందని తెలిపారు. కచ్చిదారులకు కూడా న్యాయవాదులు కచ్చితంగా తెలియపరచాలని వారు తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ విజయవంతం అయ్యేందుకు న్యాయవాదులు, కక్షిదారులు సహాయ సహకారాలు ఎంతో అవసరమని వారు తెలిపారు. రాజీకు తగ్గ సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు పరిష్కరించుటకు న్యాయవాదుల సహకారం అందించాలని బార్ అసోసియేషన్ న్యాయవాదులకు సూచించడం జరిగిందన్నారు.
జాతీయ లోక్ అదాలత్ తేదీ మార్పు
- Advertisement -
RELATED ARTICLES


