విశాలాంధ్ర తనకల్లు : వైఎస్ఆర్సిపి మైనార్టీ సెల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గాఎన్నికయ్యారు.వైయస్సార్ పార్టీకి ముందు నుండి మైనార్టీ పరంగా సేవలందిస్తున్న మహమ్మద్ అలీ కి ఈ పదవి దక్కడం సంతోషించదగ్గ విషయమని వైసిపి మండల సీనియర్ నాయకులు కొక్కంటి శ్రీనివాసులు నాయుడు, దొరస్వామి తదితరులు దుశ్యాలువాతో పూలమాలలు వేసి సత్కరించారు. పదవి చేపట్టిన మహమ్మద్ అలీ మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి నాకు పదవి ఇవ్వడ వలన ఇంకా బాధ్యత పెరిగిందని పార్టీ అభివృద్ధి కోసం మైనార్టీల అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. .నా ఎన్నికలు సహకరించిన కదిరి వైసిపి ఇన్చార్జ్ మక్బూల్ అహమ్మద్ తో పాటు మండల నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.


