ఆలయ కమిటీ అధ్యక్షుడు సూర్య ప్రకాష్
విశాలాంధ్ర – ధర్మవరం ; పట్టణంలోని పుట్టపర్తి రోడ్, సాయి నగర్ లో వెలిసిన సాయిబాబా దేవాలయమునకు కీర్తిశేషులు కుంచకు హనుమప్ప, భార్య నాగమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు కుంచపు ప్రసాద్, లక్ష్మీకాంత వారు శాశ్వత అన్నదానం కొరకు రూ.1,00,016 లను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఘనంగా సన్మానిస్తూ వారి పేరిటన ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ నిత్యాన్న దానమునకు విరాళం ఇచ్చిన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రాంప్రసాద్, కార్యదర్శి కృష్ణమూర్తి, ఉప కార్యదర్శి రామాంజనేయులు, కోశాధికారి శ్రీనివాసరావు తో పాటు డైరెక్టర్లు పాల్గొన్నారు.
సాయిబాబా దేవాలయానికి విరాళం
- Advertisement -


