విశాలాంధ్ర /ఉరవకొండ : విశ్రాంతి ఉద్యోగుల అసోసియేషన్ ఉరవకొండ తాలూకా అధ్యక్షులుగా కె. క్రిష్టప్ప ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. స్థానిక విశ్రాంతి ఉద్యోగుల భవనంలో ఈనెల 17వ తేదీన నిర్వహించిన అసోసియేషన్ సర్వ సభ్య సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఎన్నుకున్న కమిటీని బుధవారం ప్రకటించారు. అధ్యక్షులుగా కె.క్రిష్టప్ప ఉపాధ్యక్షులుగా పోతప్ప,ఎస్ నజీర్, ఎం ఎర్రి స్వామి, కార్యదర్శిగా ఎన్ వెంకటస్వామి, సహాయ కార్యదర్శులుగా చౌడప్ప దత్తాత్రేయ, బి కృష్ణమూర్తి, కోశాధికారిగా చెన్నా రాయుడు, కార్యవర్గ సభ్యులుగా గురుస్వామి రసూల్, బి ఎర్రి స్వామి, ఎన్. నారాయణ, హరిదాసు, తంబన్న, లింగన్న గౌడ్, వీరన్న హలీమాభి ని ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. ఈ నూతన కమిటీ 2023 జనవరి ఒకటి నుంచి31-12- 2025 వరకు కొనసాగుతున్నట్లు వారు తెలిపారు. విశ్రాంతి ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని నూతన అధ్యక్షులు క్రిష్టప్ప మరియు కార్యవర్గ సభ్యులు తెలిపారు