- Advertisement -
మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవో
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద సామాజిక భద్రత పింఛన్లకు దరఖాస్తు చేసుకునే గడువును సెప్టెంబర్ 18 వరకు పొడిగించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య, ఎంపీడీవో వెంకటేశు తెలిపారు. ఇంకనూ పెన్షన్ కు అర్హత ఉండి దరఖాస్తు చేసుకోని వారు ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కూడా వారు స్పష్టం చేశారు.


