ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. లోక్సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు వచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.ఈ బిల్లుపై మధ్యాహ్నం 1 గంట నుంచి చర్చ ప్రారంభమవుతుందని రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ తెలిపారు. చర్చ కోసం రెండు గంటల సమయాన్ని కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. సభ్యులు ఈ సమయంలో బిల్లుపై తమ అభిప్రాయాలను తెలియజేయనున్నారు. అంతకుముందు బుధవారం నాడు ఈ బిల్లుకు లోక్సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మినహా సభలోని మిగతా పార్టీలన్నీ బిల్లుకు మద్దతు పలికాయి. లోక్సభలో ఆమోదం పొందిన అనంతరం, చట్ట రూపం దాల్చేందుకు బిల్లును ఎగువ సభ అయిన రాజ్యసభకు పంపారు. రాజ్యసభ ఆమోదం కూడా లభిస్తే, అమరావతి ఏకైక రాజధానిగా చట్టబద్ధతను సంతరించుకుంటుంది.
రాజ్యసభలో అమరావతి రాజధాని బిల్లు.. రెండు గంటల పాటు చర్చ
- Advertisement -
RELATED ARTICLES


