విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని కె. హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.కామ్ తృతీయ సంవత్సరం విద్యార్థి బి.హర్ష వర్ధన్ జాతీయ సమైక్యత శిబిరానికి ఎంపికైనట్లు ప్రిన్సిపల్, డా. కె. ప్రభాకర్రెడ్డి తెలిపారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ బీ.కాం మూడవ సంవత్సరం చదువుతున్న బి.హర్ష వర్ధన్ పశ్చిమ గోదావరి జిల్లా లోని నర్సాపూర్ లోని శ్రీ వై ఎన్ కాలేజ్ అటానమస్లో ఫిబ్రవరి 2 నుండి 9 వ తేదీ వరకు జరిగే జాతీయ సమైక్యత శిబిరంలో పాల్గొంటాడని తెలిపారు. దేశ సంస్కృతి, ఆచార, సంప్రదాయాలు, సాంస్కృతిక ప్రదర్శన కార్యకలాపాలు, యువకులు, విద్యార్థులకు అవగాహన, సామాజిక సేవలు, దేశ సేవ, దేశ అభివృద్ధికి పాటుపడేలా భారత ప్రభుత్వం, యువజన వ్యవహారాల మంత్రిత్వ , క్రీడాశాఖ,ఎన్.ఎస్.ఎస్ యొక్క ప్రాంతీయ డైరెక్టరేట్, హైదరాబాద్ ల అధ్వర్యంలో జాతీయ సమైక్యత సిబిరం నిర్వహిస్తున్నారని తేలిపారు. తదుపరి ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్ డా.బి.గోపాల్ నాయక్, పలు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు బి.హర్షవర్ధన్ ను అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
“జాతీయ సమైక్యత శిబిరానికి బి. హర్ష వర్ధన్ ఎంపిక”
RELATED ARTICLES