Wednesday, February 5, 2025
Home Blog Page 152

ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక

విశాలాంధ్ర. రాజాం. విజయనగరం జిల్లా.

రాజాం నియోజకవర్గం నూతన కార్యవర్గం ని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికల అధికారులుగా బొత్స బుద్ధుడు,బొత్స జానకిరావు , కంబాల సుదర్శన్ వ్యవహరించారు. ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినవి. గౌరవ అధ్యక్షులుగా తురక బలరాం,అధ్యక్షులుగా ధర్మాన కృష్ణ ప్రధాన కార్యదర్శిగా బోనెల గౌరీశ్వరరావు కోశాధికారిగా కలమట జగన్నాథం, ఉపాధ్యక్షులుగా దూసి సుదర్శన్ జాయింట్ సెక్రటరీగా బత్తిన సురేష్, మీడియా కన్వీనర్లుగా గుడిబండ సూర్యనారాయణ, భీంపల్లి తిరుపతిరావు, తేగల మోహన్ లను ఎన్నుకోబడ్డారు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నుకోబడిన బొత్స జానకిరావు సూర.జయకృష్ణ అలాగే మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నుకోబడ్డ కలమట జగన్నాధమును ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరూ ఘనంగా సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో జరజాన.నీలయ్య నక్క తవిటయ్య అల్లిన. తవిటి రావు,పాపారావు, మారెళ్ల కృష్ణమూర్తి, తలచింతల లక్ష్మీప్రసాదరావు,వర్రి దాలయ్య,డర్రు సుందర్ రావు, కురమాన దిలీప్ గూనాన., సింహాచలం,సూర శిరీష బూర అప్పారావు తదితరులు పాల్గొన్నారు

ప్రతిభ కనబరిచిన ఆర్టీసీ ఉద్యోగులకు నగదు ,ప్రశంసా పత్రాలు పంపిణీ..

డిపో మేనేజర్ సత్యనారాయణ


విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ ఆదాయ అభివృద్ధికి కృషిచేసిన, ప్రతిభ ఘనపరిచిన ఆర్టీసీ ఉద్యోగులకు నగదు, ప్రశంసా పత్రాలను డిపో మేనేజర్ సత్యనారాయణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదర్శ ఉద్యోగుల అభినందన సభను వారు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అక్టోబర్-2024 లో ఉత్తమ ప్రతిభ ఘనపరిచిన కండక్టర్లు డ్రైవర్లు గ్యారేజ్ సిబ్బందికి తన చేతుల మీదుగా నగదు ప్రశంసా పత్రాలను అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ రాబోయే రోజులలో మరింత పోటీ తత్వముతో పనిచేసి, ఆర్టీసీ డిపోకు మంచి గుర్తింపు తేవాలని తెలిపారు. అంతేకాకుండా ప్రయాణికులు పట్ల మర్యాదగా ప్రవర్తిస్తూ గౌరవంగా ఉండాలని, తదుపరి కేఎంపిఎల్ పెంచి డిపో అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని వారు తెలిపారు. అనంతరం ప్రతిభ ఘనపరిచిన ఎనిమిది మంది ఆర్టీసీ ఉద్యోగులను అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో ఇరమై (576977 కండక్టర్ ),నరసింహులు(576444 కండక్టర్),జివిఆర్ రెడ్డి (550140 కండక్టర్ ),నాగరాజు(408166 కండక్టర్),
యన్ నరసింహులు ( 575754 కండక్టర్ ),పి పోలేరప్ప (408421 డ్రైవర్ ),వి ఆంజనేయులు (577005 డ్రైవర్ ),ఏ ఏ నారాయణ (408915 డ్రైవర్ ) కలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు శ్రీరాములు, జిపి రెడ్డి, నాగ శేఖర్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

మహిళ గొలుసు అపహరణ

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని శారద నగర్ లో గుర్తుతెలియని దొంగలు శాంతినగర్ కు చెందిన రాములమ్మ తన బిడ్డ ఇంటికి వెళుతుండగా ఇద్దరు వ్యక్తులు ముఖానికి మాస్కులు వేసుకొని వచ్చి తన మెడలో ఉన్న 3.50 తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారని బాధితురాలు వాపోయింది. ఈ సందర్భంగా టూటౌన్ పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. వన్ టౌన్, టూ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్, రెడ్డప్పలు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి బాధితురాలితో వివరాలను తెలుసుకొని చుట్టుపక్కల ప్రాంతాలలో గాలింపు చర్యలు వేగవంతం చేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలను చేపట్టారు. కొన్ని నెలలుగా ధర్మవరంలో చైనీస్ మ్యాచింగ్ ఆగిపోగా, తిరిగి మొదలు కావడంతో పట్టణ మహిళలు భయంధారులకు గురవుతున్నారు. పోలీసులు ఇటువంటి వారిపై చర్యలు గైకొనాలని, మహిళలకు భద్రత కల్పించాలని కోరుతున్నారు.

టౌన్ మిషన్ కోఆర్డినేటర్ ఉద్యోగిని నియమించండి……

సంఘం పొదుపు డబ్బులు తీసుకునేందుకు ఇబ్బందులు

విశాలాంధ్ర -పామిడి (అనంతపురం జిల్లా) : రెండు నెలలు గడుస్తున్న టౌన్ మిషన్ కోఆర్డినేటర్ ఉద్యోగి లేనందున తీవ్ర ఇబ్బంది పడుతున్నామని పామిడి పట్టణం నందు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) లో ఉన్న మహిళా సంఘాలు సభ్యులు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ పామిడి పట్టణంలొ గత 35 సంవత్సరాలు నుండి ఇప్పటివరకు 485 సంఘాలు ఏర్పాటు చేసుకున్నామని, ఈ 485 సంఘాల్లో 4892 మంది సభ్యులు ఉన్నారాన్నారు. సంఘంలో నుండి పొదుపు చేసుకున్న మొత్తంలో సంఘం సభ్యులు డబ్బులు డ్రా చెయ్యడానికి వెళ్ళగా టౌన్ మిషన్ కోఆర్డినేటర్ వారి సంతకం లేనిది బ్యాంకు వారు డబ్బులు డ్రా చేయడానికి అనుమతి లేదని కావున సంఘం సభ్యులు అత్యవసరంగా మెప్మా ఉద్యోగి కొరకు వెళ్లగా గత రెండు నెలలుగా ఇక్కడ ఏ అధికారులు లేరని చెప్పడం జరిగిందన్నారు. సెప్టెంబర్ 28 తేదీన మెప్మా అధికారిబదిలీపై వేరే పట్టణానికి వెళ్ళారని, బదిలీ చేసిన తారీకు నుండి ఏ అధికారిని నియమించలేదు కాబట్టి మెప్మా అధికారి మా గురించి పట్టణంలో సంఘాల సభ్యులు వివరణ అడగ్గా మీకు డిఆర్డిఏ వెలుగులో వెళ్ళమన్నారని అక్కడికి వెళ్ళగా తిరిగి వెనక్కి పంపించారన్నారు. పై అధికారులు వెంటనే స్పందించి త్వరలోనే అధికారిని నియమించాలని మహిళా సంఘాలు కోరుతున్నారు లేకుంటే ధర్నాలు,రిలే నిరాహారదీక్షలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

టౌన్ మిషన్ కోఆర్డినేటర్ ఉద్యోగిని నియమించండి……

సంఘం పొదుపు డబ్బులు తీసుకునేందుకు ఇబ్బందులు……

విశాలాంధ్ర -పామిడి (అనంతపురం జిల్లా) : రెండు నెలలు గడుస్తున్న టౌన్ మిషన్ కోఆర్డినేటర్ ఉద్యోగి లేనందున తీవ్ర ఇబ్బంది పడుతున్నామని పామిడి పట్టణం నందు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) లో ఉన్న మహిళా సంఘాలు సభ్యులు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ పామిడి పట్టణంలొ గత 35 సంవత్సరాలు నుండి ఇప్పటివరకు 485 సంఘాలు ఏర్పాటు చేసుకున్నామని, ఈ 485 సంఘాల్లో 4892 మంది సభ్యులు ఉన్నారాన్నారు. సంఘంలో నుండి పొదుపు చేసుకున్న మొత్తంలో సంఘం సభ్యులు డబ్బులు డ్రా చెయ్యడానికి వెళ్ళగా టౌన్ మిషన్ కోఆర్డినేటర్ వారి సంతకం లేనిది బ్యాంకు వారు డబ్బులు డ్రా చేయడానికి అనుమతి లేదని కావున సంఘం సభ్యులు అత్యవసరంగా మెప్మా ఉద్యోగి కొరకు వెళ్లగా గత రెండు నెలలుగా ఇక్కడ ఏ అధికారులు లేరని చెప్పడం జరిగిందన్నారు. సెప్టెంబర్ 28 తేదీన మెప్మా అధికారిబదిలీపై వేరే పట్టణానికి వెళ్ళారని, బదిలీ చేసిన తారీకు నుండి ఏ అధికారిని నియమించలేదు కాబట్టి మెప్మా అధికారి మా గురించి పట్టణంలో సంఘాల సభ్యులు వివరణ అడగ్గా మీకు డిఆర్డిఏ వెలుగులో వెళ్ళమన్నారని అక్కడికి వెళ్ళగా తిరిగి వెనక్కి పంపించారన్నారు. పై అధికారులు వెంటనే స్పందించి త్వరలోనే అధికారిని నియమించాలని మహిళా సంఘాలు కోరుతున్నారు లేకుంటే ధర్నాలు,రిలే నిరాహారదీక్షలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

లాన్ టెన్నిస్ పోటీలకు పిఈటి శివకృష్ణ ఎంపిక

విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం పట్టణానికి చెందిన పిఈటి శివకృష్ణ ఆలిండియా సివిల్ సర్వీసెస్ ఎంప్లాయిస్ లాంగ్ టెన్నిస్ పోటీలకు ఎంపిక కావడం జరిగింది. వీరు కొత్తచెరువు మండలం కేసాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిఈటిగా విధులు నిర్వహిస్తున్నారు.విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 6వ తేదీ లా అండ్ టెన్నిస్ పోటీలు జరిగాయి. ఇందులో భాగంగానే శ్రీ సత్యసాయి జిల్లా నుంచి పోటీల్లో పాల్గొన్న శివకృష్ణ మూడు మ్యాచుల్లో నెగ్గి రెండో స్థానంలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక కావడం కూడా జరిగింది. ఈ ఎంపిక పట్ల మండల విద్యాశాఖ అధికారులతో పాటు తోటి ఉపాధ్యాయ బృందము పిఈటి బృందము బంధుమిత్రులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

డెంగ్యూ వ్యాధి పై పూర్తిగా ప్రజలకు అవగాహన కల్పించాలి

జిల్లా సహాయ మలేరియా అధికారి లక్ష్మీనాయక్
విశాలాంధ్ర ధర్మవరం : డెంగ్యూ వ్యాధిపై పూర్తిగా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా సహాయ మలేరియా అధికారి లక్ష్మీనాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు శివానగర్లో జిల్లా సహాయ మలేరియా అధికారితోపాటు సబ్ యూనిట్ మలేరియా అధికారులు పర్యటించి డెంగ్యూ వ్యాధిపై ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇంటి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని, నీటి తొట్టెలలో నీటిని నిల్వ ఉంచరాదని తెలిపారు. రాత్రి సమయాలలో ఇంటిలో వేపాకు పొగ వేసుకోవాలని, ప్రతి శుక్రవారం ఫ్రైడే ను ఫ్రైడేను పాటించాలని తెలిపారు. వెక్టార్ కంట్రోల్ ఇష్యూస్ గురించి కూడా తెలియజేయడం జరిగిందని తెలిపారు. ప్రజల అవగాహన విషయంలో అధికారులు నిర్లక్ష్యం వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారులు జయరాం నాయక్, గోపీనాయక్, వెంకటేష్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంను సద్వినియోగం చేసుకోండి. ఆర్డిఓ మహేష్

విశాలాంధ్ర ధర్మవరం : ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 10వ తేదీ, 23వ, 24వ తేదీలలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని బిఎల్ఓ ల ద్వారా పోలింగ్ బూతులలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నూతన ఓటు, చేర్పులు మార్పులు తదితర విషయాలను పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. ఫారం-6 లో 18 సంవత్సరాలు నిండిన వారు ఓటును నమోదు చేసుకొనుట, ఫారం-7 లో తొలగింపులు, మృతి, డబుల్ ఎంట్రీ, ఇల్లు మార్పులు, వివాహమై వెళ్ళిన వారు, అదేవిధంగా ఫారం-8 చేర్పులు మార్పులు లను బి ఎల్ ఓ ల దగ్గరకు వెళ్లి మార్పు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. కావున ప్రజలందరూ ఈ ప్రత్యేక ఓటర్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

గర్భిణీలు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి..

మెడికల్ ఆఫీసర్ డాక్టర్- ఎన్. గౌతమి.
విశాలాంధ్ర ధర్మవరం : గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడే చక్కటి ఆరోగ్యం లభిస్తుందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్- ఎన్. గౌతమి, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు చిన్న తంబి చిన్నప్ప, కార్య దర్శి మంజునాథ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని శివానగర్లో గల అర్బన్ హెల్త్ సెంటర్లో గర్భిణీ స్త్రీలకు వైద్యులు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీ చేతులు మీదుగా పండ్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినెల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీల పట్ల గ్రామాలలో పట్టణాలలో పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. గర్భిణీ స్త్రీల పట్ల కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తలు తీసుకొని, ఎప్పటికప్పుడు వైద్య చికిత్సలను అందించి, ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం పొందేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని తెలిపారు. నెలవారి వైద్య చికిత్సలు తప్పనిసరిగా గర్భిణీ స్త్రీలు చేయించుకోవాలని తెలిపారు. సుఖమైన ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకే వెళ్లాలని తెలిపారు. ప్రభుత్వం కూడా అన్ని సౌకర్యాలను కల్పించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వేణుగోపాల్, సహకార దర్శి రామకృష్ణ, కోశాధికారి చంద్రశేఖర్, సభ్యులు రామకృష్ణ, సాయి ప్రసాద్, నాగరాజు, నారాయణరెడ్డి, ఏఎన్ఎం పుష్పలత, నారాయణమ్మ ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

నేటి ప్రపంచానికి చార్టెడ్ అకౌంటెంట్ చాలా ముఖ్యం…

కళాశాల ప్రిన్సిపాల్ హర్షవర్ధన్
విశాలాంధ్ర ధర్మవరం : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సంపాదన కోసం ఎన్నో దారులు ఉన్నాయని,సంపాదన పరిమితి దాటిన తరువాత పన్ను చెల్లించాల్సి ఉంటుంది అని,వాటి గురించిన సమగ్ర విశ్లేషకుడు చార్టెడ్ అకౌంటెంట్ అని వివేకానంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హర్ష వర్ధన్ తెలిపారు. స్థానిక రేగాటిపల్లె రోడ్డు నందు గల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల నందు గుంటూరు మాస్టర్మైండ్స్ కళాశాల వారిచే చార్టెడ్ అకౌంటెంట్ యొక్క విశిష్టతను కళాశాల డైరెక్టర్ బాలం లక్ష్మీనారాయణ రెడ్డి, కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా నిపుణుడైన చార్టెడ్ అకౌంటెంట్ ల కొరత తీవ్రంగా ఉన్నదని,ఇది చాలా విచారించదగ్గ విషయం అని వారు తెలిపారు. మాస్టర్మైండ్స్ కళాశాల ప్రతినిధులు మాట్లాడుతూ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కూడా సిఎ లేదా సిఎంఎ చేయచ్చునని ఆసక్తి గలవారు తమను సంప్రదిస్తే తప్పకుండా అవగాహన కల్పించి నిపుణులుగా తీర్చిదిద్దుతామని వారు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల కామర్స్ విభాగాధిపతి కృష్ణయ్య,అధ్యాపకులు నరేష్,కళాశాల ఏవో రమేష్,విద్యార్థులు పాల్గొన్నారు.