Homeఆంధ్రప్రదేశ్మద్యం తాగడానికి డబ్బుల కోసం బస్సు చోరీ

మద్యం తాగడానికి డబ్బుల కోసం బస్సు చోరీ

- Advertisement -

విశాఖపట్నంలో బస్సును ఎత్తుకెళ్లిన ఘనుడు
విశాఖపట్నంలో ఓ వ్యక్తి మద్యం డబ్బుల కోసం ఆర్టీసీ బస్సును దొంగిలించిన ఘటన కలకలం రేపింది. మద్దిలపాలెం డిపోలో పార్క్ చేసిన బస్సు మాయమవడంతో పోలీసులు సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అనకాపల్లి జిల్లాకు చెందిన ఈగల పైడిరాజును రామా టాకీస్ సమీపంలో బస్సుతో పట్టుకున్నారు. డీజిల్ అమ్మి మద్యం తాగాలనే ఉద్దేశంతోనే బస్సు ఎత్తుకెళ్లినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. గతంలోనూ ఇదే తరహా నేరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.. ఆ వివరాలను పోలీసులు వెల్లడించారు.

విశాఖపట్నం రామా టాకీస్ ప్రాంతానికి చెందిన TV నాయుడు 2007 ఆర్టీసీకి ఆరు బస్సుల్ని అద్దె ప్రాతిపదికన నడుపుతున్నారు. ఈ నెల 16న AP 39UX 2888 నంబర్ బస్సును డ్రైవర్ అప్పారావు శ్రీకాకుళం నుంచి రాత్రి 9 గంటలకు విశాఖపట్నం వచ్చి.. బస్సుకు 197 లీటర్ల డీజిల్‌తో ఫుల్ ట్యాంక్ చేయించారు. రాత్రి 9:45 గంటలకు మద్దిలపాలెం డిపో పార్శిల్ కౌంటర్ ప్రక్కన బస్సును పార్క్ చేసి రెస్ట్ రూమ్‌లోకి వెళ్లి డ్రైవర్ పడుకున్నారు. ఈ నెల 17న ఉదయం 05:00 గంటలకు డ్రైవర్ నిద్ర లేచి బస్సు పార్క్ చేసిన స్థలం దగ్గురకు వెళ్లి చూడగా బస్సు కనిపించలేదు. వెంటనే బస్సు డ్రైవర్ అప్పారావు బస్సు ఓనర్ TV నాయుడికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. బస్సు డ్రైవర్ అప్పారావు, బస్సు ఓనర్ అయిన TV నాయుడు చుట్టు ప్రక్కల ఒక రోజు అంతా వెతికినా దొరకలేదు. వెంటనే ఎంవీపీ పోలీసుల్ని ఆశ్రయించడంతో.. క్రైమ్ నెంబర్ 18/2026 U/S U/S 303(2) దీచీS గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అని తెలిపారు.

పోలీస్ సిబ్బంది మద్దిలపాలెం డిపో ఉన్నcc TV ఫుటేజ్, కమాండ్ కంట్రోల్‌లో ఉన్నccTV ఫుటేజ్ ఆధారంగా కనిపించుకుండా పోయిన బస్సు వెళ్లిన మార్గాన్ని పరిశీలించారు. చివరికి బస్సు లంకిలపాలెం జంక్షన్ వైపు వెళ్ళినట్లు గుర్తించారు. టీవీ నాయుడు దగ్గర పనిచేసే ఈగల పైడిరాజు అనే డ్రైవర్ ఆ ప్రాంతంలోనే ఉన్నట్లు తెలిసి ఆ దిశగా దర్యాప్తు చేయగా.. పైడిరాజు నేరం చేసినట్లుగా గుర్తించారు. ఈ నెల 19న మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో రామా టాకీస్ దగ్గర ఉన్న ప్రభుత్వ కంటి ఆసుపత్రి దగ్గర ఈగల పైడిరాజు బస్సును నడిపించుకుని వస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సును స్వాధీనం చేసుకున్నారు. అతడిని ప్రశ్నించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. మద్యానికి బానిసై.. బస్సు ఆయిల్ ట్యాంక్‌లో డీజిల్ చోరీ చేస్తే మద్యానికి డబ్బులు వస్తాయని భావించి బస్సును ఎత్తుకెళ్లినట్లు అంగీకరించాడు. పైడిరాజు 2025 ఫిబ్రవరిలో కూడా ద్వారకానగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో టీవీ నాయుడికి చెందిన బస్సును తీసుకెళ్లి అప్పుడు కూడా డీజిల్ దొంగలించి రూ.4వేలకు అమ్మేశాడు. ఆ తర్వాత బస్సును అనకాపల్లి జిల్లా బయ్యవరం దగ్గర హైవేపై వదిలేసి వెళ్లిపోయాడు. ఆ చోరీ ఘటనపై విశాఖపట్నం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది అని పోలీసులు వివరాలు వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు