- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని సంతమార్కెట్లో కార్మిక భవన నిర్మాణానికి మంత్రి సత్య కుమార్ యాదవ్ సహకారంతో జూటూరు వెంకటేష్ పదివేల రూపాయల నగదును భవన నిర్మాణ కార్మికులకు అందజేశారు. కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ కల నిజం అవుతున్నందుకు కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్మిక సంఘం నాయకులు మంత్రి సత్య కుమార్ యాదవ్కు కృతజ్ఞతలు తెలుపుతూ, స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు అందరూ కార్మిక భవన నిర్మాణానికి తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.


